కాకినాడ జిల్లా కరపలోని శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఉదయం పూజల సమయంలో అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టాయి. ఈ విషయాన్ని ఆలయ పూజారి గుర్తించగా, వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. చీర, సారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది అమ్మవారి మహిమకు నిదర్శనమని పూజారి తెలిపారు.