సెల్‌ఫోన్ డ్రైవి౦గ్ కేసులో కి౦ది కోర్టుకి హైకోర్ట్ అక్షి౦తలు

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపారనే చిన్న నేరానికి 4 రోజుల జైలు శిక్ష విధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. చిన్న నేరానికి జరిమానా వేసి హెచ్చరించకుండా అంత పెద్ద శిక్ష విధించడం సరికాదంది. యువకుడిగా ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తే భవిష్యత్తులో అతనితోపాటు వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో శిక్ష విధించే ముందు పరిశీలించాలని కింది కోర్టులకు సూచించింది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపాడని ఎం.వి.భరద్వాజ అనే యువకుడికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ సైబరాబాద్‌ […]

సెల్‌ఫోన్ డ్రైవి౦గ్ కేసులో కి౦ది కోర్టుకి హైకోర్ట్ అక్షి౦తలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:48 PM

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపారనే చిన్న నేరానికి 4 రోజుల జైలు శిక్ష విధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. చిన్న నేరానికి జరిమానా వేసి హెచ్చరించకుండా అంత పెద్ద శిక్ష విధించడం సరికాదంది. యువకుడిగా ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తే భవిష్యత్తులో అతనితోపాటు వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో శిక్ష విధించే ముందు పరిశీలించాలని కింది కోర్టులకు సూచించింది.

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపాడని ఎం.వి.భరద్వాజ అనే యువకుడికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ సైబరాబాద్‌ నాలుగో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. రూ.500 జరిమానా సంబంధిత కోర్టులో చెల్లించాలంటూ భరద్వాజకు ఆదేశాలు జారీ చేసింది.

జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ భరద్వాజ మేనమామ హైకోర్టులో అత్యవసరంగా మంగళవారం ఉదయం కోర్టు అనుమతి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భరద్వాజ నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదన్న విషయాన్ని అయినా పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు జరిమానా విధించి ఉండాల్సిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.