9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్…. ఏం తేలిందంటే…!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన‌ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్ అయ్యింది. ఈ కేసు తీరుతెన్నుల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కున్న నేప‌థ్యంలో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో అని తెలుసుకోవ‌డం కోసం అంద‌రూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వాళ్లంతా ప్రాణాల‌తో ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిన‌ట్టు స‌మాచారం. ఇక‌ వాళ్లంతట వాళ్లే కావాల‌ని బావిలోకి దూకారా? లేదంటే మత్తు, విషంలాంటిది ఇచ్చి బతికి […]

9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్.... ఏం తేలిందంటే...!
Follow us

|

Updated on: May 23, 2020 | 3:51 PM

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన‌ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృతదేహాలకు పోస్టుమార్టం కంప్లీట్ అయ్యింది. ఈ కేసు తీరుతెన్నుల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కున్న నేప‌థ్యంలో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో అని తెలుసుకోవ‌డం కోసం అంద‌రూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వాళ్లంతా ప్రాణాల‌తో ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిన‌ట్టు స‌మాచారం. ఇక‌ వాళ్లంతట వాళ్లే కావాల‌ని బావిలోకి దూకారా? లేదంటే మత్తు, విషంలాంటిది ఇచ్చి బతికి ఉండగానే బావిలో ప‌డేశారా అన్న విష‌యాలు తేలాల్సి ఉంది.

పోస్టుమార్టానికి సంబంధించి టీవీ9తో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ రజామాలిక్ చెప్పిన వివ‌రాలు..

  • ఊపిరితిత్తుల్లోకి నీరుచేరడం వల్ల‌ తొమ్మిది మంది చనిపోయారు..
  • అందరూ బావిలోనే తుదిశ్వాస విడిచారు
  • వారి విశ్రాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాము.. వారిపై ఫుడ్ పాయిజన్ జరిగిందా లేదా తేలాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి..
  • నలుగురు మృతుల ఒంటిపై గాయాలున్నాయి..
  • ఈ సంఘటనకు ముందు పెనుగులాట జరిగి ఉంటుందని భావిస్తున్నాం..
  • ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసరికి పదినుంచి.. పదిహేను రోజుల స‌మ‌యం పడుతుంది..

ఈ కేసులో ముఖ్యంగా ఫోన్ కాల్స్ డిటేల్స్ కీల‌కంగా భావిస్తున్నారు పోలీసులు. మక్సూద్ త‌న‌య‌ బుస్రాతో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని అనుమానిస్తోన్న‌ యాకూబ్ ఫోన్ కాల్స్‌తోపాటు.. ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడ‌నే విష‌యాల‌పై పోలీస‌లు ఫోక‌స్ పెట్టారు. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో.. వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అదుపులో ఉన్న అనుమానితుడు యాకూబ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అతడితోపాటు బిహర్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

Latest Articles
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
ఈ పాపని గుర్తుపట్టారా..? తెలుగునాట చాలా ఫేమస్...
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!