AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!

లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైతే మారటోరియంను వినియోగించకుండా లోన్లను సకాలంలో చెల్లించారో.! వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపు/క్యాష్‌బ్యాక్‌ ఉంటుందని

లాక్‌డౌన్‌లో బ్యాంకు ఈఎంఐలు చెల్లించారా? అయితే క్యాష్‌బ్యాక్‌ మీ సొంతం!
Ravi Kiran
|

Updated on: Oct 25, 2020 | 2:59 PM

Share

Paid all loan EMIs: మార్చి 1 నుంచి ఆగష్టు 31 మధ్యలో రుణాలపై చక్రవడ్డీని విధించకూడదని సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైతే మారటోరియంను వినియోగించకుండా లోన్లను సకాలంలో చెల్లించారో.! వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లింపు/క్యాష్‌బ్యాక్‌ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల వరకు రుణాలు తీసుకున్న చిరు వ్యాపార సంస్థలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు దాని ఫలాలు అందుతాయని తెలిపింది.

వాణిజ్య, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలతో సహా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రితలో ఉన్న మనీ లెండర్స్‌ అన్నింటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పలు గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ఆరు నెలల వడ్డీ-చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని మారటోరియం సమయంలో ఈఎంఐలు చెల్లించినవారికి క్యాష్‌బ్యాక్‌ రూపంలో నవంబర్ 5వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్..