AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: నిర్భయ దోషి అక్షయ్‌ సింగ్‌ పిటిషన్.. 17న విచారించనున్న సుప్రీం!

నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌ సింగ్‌ తనకు విధించిన ఉరి శిక్ష తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రివ్యూ పిటిషన్‌‌ను సుప్రీం కోర్టు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది. కాగా, ఢిల్లీలో ఉన్న జల, వాయు కాలుష్యం వల్ల ఇప్పటికే ఆయుష్ తగ్గిపోతోందని.. అలాంటప్పుడు  ఇక ఉరి ఎందుకని.? అక్షయ్ కుమార్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరోవైపు నిర్భయ కేసులోని […]

బ్రేకింగ్: నిర్భయ దోషి అక్షయ్‌ సింగ్‌ పిటిషన్.. 17న విచారించనున్న సుప్రీం!
Ravi Kiran
|

Updated on: Dec 12, 2019 | 5:45 PM

Share

నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్‌ సింగ్‌ తనకు విధించిన ఉరి శిక్ష తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రివ్యూ పిటిషన్‌‌ను సుప్రీం కోర్టు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది.

కాగా, ఢిల్లీలో ఉన్న జల, వాయు కాలుష్యం వల్ల ఇప్పటికే ఆయుష్ తగ్గిపోతోందని.. అలాంటప్పుడు  ఇక ఉరి ఎందుకని.? అక్షయ్ కుమార్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరోవైపు నిర్భయ కేసులోని నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేయగా.. వాళ్లందరికి కోర్టు ఉరి శిక్షను విధించింది. ఇక ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఈ మృగాళ్లకు ‘ఉరి శిక్ష’ను అమలు చేయనున్నారు.