AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాక్: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.!

తమ డిమాండ్ల సాధన కోసం టీఎస్ఆర్టీసీ కార్మికులు దాదాపు 52 రోజుల పాటు సమ్మె చేశారు. కేసీఆర్.. ఆర్టీసీ పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని కార్మికులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యూనియన్ల మాట వినకుండా వచ్చి విధుల్లోకి చేరాలంటూ సీఎం పలుమార్లు డెడ్‌లైన్లు విధించినా వర్కర్లు లెక్క చేయలేదు. ఇక రోజులు గడిచే కొద్దీ పరిస్థితి తలక్రిందులు అయ్యాయి. హైకోర్టు, లేబర్ కోర్టుల్లో ఆర్టీసీ జేఏసీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో.. సమ్మెను విరమిస్తున్నామని.. కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని […]

షాక్: కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.!
Ravi Kiran
|

Updated on: Nov 27, 2019 | 10:10 PM

Share

తమ డిమాండ్ల సాధన కోసం టీఎస్ఆర్టీసీ కార్మికులు దాదాపు 52 రోజుల పాటు సమ్మె చేశారు. కేసీఆర్.. ఆర్టీసీ పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని కార్మికులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యూనియన్ల మాట వినకుండా వచ్చి విధుల్లోకి చేరాలంటూ సీఎం పలుమార్లు డెడ్‌లైన్లు విధించినా వర్కర్లు లెక్క చేయలేదు. ఇక రోజులు గడిచే కొద్దీ పరిస్థితి తలక్రిందులు అయ్యాయి. హైకోర్టు, లేబర్ కోర్టుల్లో ఆర్టీసీ జేఏసీకి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో.. సమ్మెను విరమిస్తున్నామని.. కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది.

అయితే ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారంగా సమ్మెకు వెళ్లి.. మళ్ళీ విధుల్లోకి చేరుతామంటే ఎలా అంగీకరిస్తామంటూ కార్మికులను ప్రశ్నించింది. దీంతో 49,000 మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు హైకోర్టు కూడా ఆర్టీసీ కార్మికుల మరణాలకు యూనియన్లే బాధ్యత వహించాలంటూ మరో షాక్ ఇవ్వగా.. జేఏసీ నేతలు కూడా ఇప్పుడు తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే మొన్నటి దాకా కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కార్మికలోకం ఇప్పుడు సడన్‌గా మనసు మార్చుకోవడం పెద్ద చర్చకు దారి తీస్తోంది.

‘సీఎం కేసీఆర్ సారూ.. మీ మనసు నొప్పించి ఉంటే.. క్షమించండి.. దయ చేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి చేర్చుకోండి’ అంటూ  విన్నవించడమే కాకుండా ఆయన ఫొటోకు ముషీరాబాద్ ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేయడం విశేషం. ఇదంతా చూస్తుంటే.. కార్మికులు తమ తప్పును తెలుసుకుని.. ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. మరి ఇప్పుడైనా కేసీఆర్.. కార్మికుల పట్ల జాలి చూపి.. తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.