AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోట త్రిమూర్తులుపై దాడికి యత్నించిన వ్యక్తిపై మ‌ర్డ‌ర్ అంటెప్ట్

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో స్థానికుడిపై మ‌ర్డ‌ర్ అటెంప్ట్ క‌ల‌క‌లం రేపింది. కే గంగవరం మండలం మసకపల్లిలో మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై కొందరు గుర్త‌తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. వేటకొడవళ్లు, గొడ్డ‌ళ్ల‌తో వెంటాడి న‌రికారు. తీవ్ర‌గాయాల‌పాల‌వ‌డంతో వెంట‌నే అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో అక్క‌డ్నుంచి కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికుల నుంచి వివ‌రాలు సేక‌రించారు. మంగళవారం రాత్రి ఇజ్రాయిల్‌కు ప‌రిచ‌య‌మున్న వ్య‌క్తి ఫోన్ చేసి ఓ […]

తోట త్రిమూర్తులుపై దాడికి యత్నించిన  వ్యక్తిపై మ‌ర్డ‌ర్ అంటెప్ట్
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 29, 2020 | 12:36 PM

Share

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో స్థానికుడిపై మ‌ర్డ‌ర్ అటెంప్ట్ క‌ల‌క‌లం రేపింది. కే గంగవరం మండలం మసకపల్లిలో మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై కొందరు గుర్త‌తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. వేటకొడవళ్లు, గొడ్డ‌ళ్ల‌తో వెంటాడి న‌రికారు. తీవ్ర‌గాయాల‌పాల‌వ‌డంతో వెంట‌నే అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండటంతో అక్క‌డ్నుంచి కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికుల నుంచి వివ‌రాలు సేక‌రించారు.

మంగళవారం రాత్రి ఇజ్రాయిల్‌కు ప‌రిచ‌య‌మున్న వ్య‌క్తి ఫోన్ చేసి ఓ ప్ర‌దేశానికి రమ్మ‌న‌ట్టు తెలుస్తోంది. అతడు అక్క‌డికి వెళ్లగానే వేట కొడవళ్లతో విచ‌క్ష‌ణారహితంగా దాడికి పాల్ప‌డ్డారు. ప్రాణ భయంతో పరుగులు తీసినా..ఎంత ప్రాధేయ‌ప‌డ్డా వ‌ద‌ల్లేద‌ని బాధితుడు చెబుతున్నాడు. భూషణం అనే వ్యక్తి తనపై అంత‌మొందించ‌డానికి ప్లాన్ చేశాడ‌ని.. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపిస్తున్నాడు. అయితే భూషణం పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

బాధితుడు ఇజ్రాయిల్ గతంలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై ద్రాక్షారామంలో చెప్పుతో దాడి చేసేందుకు య‌త్నించాడు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పక్కనే ఉండగానే ఈ ఘటన జరిగింది. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు ఏర్పాటు చేసిన స‌భ‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.