యూపీలో రూ.38 కోట్లు విలువ చేసే బంగారం సీజ్
ఘజియాబాద్ : ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న 120కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోదీనగర్లో చెకింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఓ వాహనంలో భారీగా బంగారాన్ని గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని సీజ్ చేశారు. దాదాపు 38 కోట్లు ఖరీదు చేసే 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న నలుగుర్ని అరెస్టు చేశారు. […]
ఘజియాబాద్ : ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న 120కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోదీనగర్లో చెకింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఓ వాహనంలో భారీగా బంగారాన్ని గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని సీజ్ చేశారు. దాదాపు 38 కోట్లు ఖరీదు చేసే 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న నలుగుర్ని అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హరిద్వార్కు బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. క్యాషియర్, డ్రైవర్తో పాటు ఇద్దరు సెక్యూర్టీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు.