పాత సామాను కొంటానని నమ్మించి
పాత సామాను కొంటానని నమ్మించిన ఓ వ్యక్తి మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఎస్కేప్ అయ్యాడు . గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.
పాత సామాను కొంటానని నమ్మించిన ఓ వ్యక్తి మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఎస్కేప్ అయ్యాడు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. కేసరపల్లిలోని పంచాయతీ ఆఫీసు దగ్గర్లో మూల్పూరు పద్మావతి అనే వివాహిత జీవనం సాగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం మోటార్ వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి.. మీ ఇంట్లో పాత టీవీలు, లేదా సామానులు ఉంటే కొంటాను అని చెప్పాడు. అలాంటివేమీ లేవని పద్మావతి బదులు చెప్పింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లి పిల్లలను చూసిన ఆ వ్యక్తి ఒక పిల్లను ఇస్తే పెంచుకుంటానని అడిగాడు.
అందుకు సమ్మతించచిన పద్మావతి పిల్లి పిల్లను ఆ వ్యక్తికి అందించేందుకు కిందకు వంగింది. అదే సమయంలో బైక్ పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో ఉన్న 6 కాసుల బంగారు గొలుసు లాక్కొని, బైక్పై పరారయ్యాడు. ఈమేరకు గన్నవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరించచారు. పంచాయతీ ఆఫీసులో ఉన్న సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :