AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత: కేటీఆర్

రోడ్లు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, మారుమూల పల్లెలు సైతం ఆర్థికాభివృద్ధికి నోచుకొంటాయని రాష్ట్ర ఐటీ, పుపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత: కేటీఆర్
Balaraju Goud
|

Updated on: Jul 07, 2020 | 6:00 PM

Share

రోడ్లు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, మారుమూల పల్లెలు సైతం ఆర్థికాభివృద్ధికి నోచుకొంటాయని రాష్ట్ర ఐటీ, పుపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ రహదారులు, వంతెనల విషయంలో గత ఆరెండ్లలో గణనీయమైన పురోగతి సాధించామని మంత్రి వెల్లడించారు. రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్తు తరాలు బాగుపడాలనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇష్టారీతిగా చెట్లను నరికితే గాలిని కూడా కొనే పరిస్థితి వస్తుందని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారానికి పూనుకున్నదని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

500 మంది జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్న కేటీఆర్.. పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే సుపరిపాలన అందిస్తురన్నారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్న మంత్రి.. కరోనా కష్టకాలంలో కూడా ఇప్పటి వరకు 57 లక్షల మందికి రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. మనం అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్న కేటీఆర్.. అడవులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోడు భూములను ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 307 మంది ఎస్టీలు, ఇతర పేదలకు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామని వెల్లడించారు. కేసీఆర్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Follow Us
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా?.. జాగ్రత్త త్వరలో హార్ట్‌ ఎటాక్ రావచ్చ
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
కొత్త ఇల్లు కొనబోతున్నారా? ముందుగా ఈ 6 వాస్తు నియమాలు చెక్ చేసుకో
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
హోటల్ గదిలోని కెటిల్‌తో టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్