సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ రాయడమా?..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాయడంపై మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్‌డీఏ ఛైర్మన్ ఆళ్లా రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ చంద్రబాబు.. సీఎం జగన్‌కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా చూస్తుంటూ చంద్రబాబుకు మతి భ్రమించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ఆర్కే. అమరావతి రైతులెవరూ రాజధాని కోసం ఆందోళనలు చేయడం లేదని, కేవలం ఇక్కడ భూమలు కొనుగోలు చేసిన చంద్రబాబు మనుషులే ఆందోళనలు చేస్తున్నారని […]

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ రాయడమా?..
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 7:45 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాయడంపై మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్‌డీఏ ఛైర్మన్ ఆళ్లా రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ చంద్రబాబు.. సీఎం జగన్‌కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా చూస్తుంటూ చంద్రబాబుకు మతి భ్రమించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ఆర్కే.

అమరావతి రైతులెవరూ రాజధాని కోసం ఆందోళనలు చేయడం లేదని, కేవలం ఇక్కడ భూమలు కొనుగోలు చేసిన చంద్రబాబు మనుషులే ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు ఇంటిమీద డ్రోన్ చక్కర్లు కొట్టిందనే ఆరోపణలపై ఆర్కే మాట్లాడుతూ దీన్ని ఖండించారు. నిజానికి చంద్రబాబు ఇంటిమీదుగా డ్రోన్ వెళ్లినమాట వాస్తవమేనని, అయితే అది వరద తీవ్రతను చిత్రీకరించడానికే అని చెప్పారు ఆర్కే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీడీపీకి అనుకూలంగానే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు ఆళ్ల. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మాత్రమే పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించారని ఆరోపించారు. గత ప్రభుత్వం హాయం నుంచి ఇప్పుడు ప్రభుత్వం మారినా చంద్రబాబును విమర్శించకపోవడం పవన్ వైఖరికి నిదర్శనమని ఎమ్మెల్యే ఆర్కే విమర్శించారు.