నిర్భయ తరపు న్యాయవాది ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Justice For Nirbhaya: దేశ రాజధాని ఢిల్లీలో సంబరాలు మిన్నంటాయి. ఏడేళ్ల క్రితం పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులైన ముఖేష్ కుమార్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు తీహార్ జైలు అధికారులు శుక్రవారం తెల్లవారు జామున ఉరిశిక్షను అమలు చేశారు. మూడో నెంబర్ జైలులో తలారీ పవన్ ఈ నలుగురిని ఒకేసారి ఉరి తీశారు. ఈ క్షణం కోసం నిర్భయ తల్లిదండ్రులు […]

నిర్భయ తరపు న్యాయవాది ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...
Follow us

|

Updated on: Mar 20, 2020 | 1:41 PM

Justice For Nirbhaya: దేశ రాజధాని ఢిల్లీలో సంబరాలు మిన్నంటాయి. ఏడేళ్ల క్రితం పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులైన ముఖేష్ కుమార్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు తీహార్ జైలు అధికారులు శుక్రవారం తెల్లవారు జామున ఉరిశిక్షను అమలు చేశారు. మూడో నెంబర్ జైలులో తలారీ పవన్ ఈ నలుగురిని ఒకేసారి ఉరి తీశారు.

ఈ క్షణం కోసం నిర్భయ తల్లిదండ్రులు మాత్రమే కాదు.. యావత్ భారతదేశం ఎదురుచూసింది. ఆశాదేవి అయితే 2013 నుంచి ఇప్పటివరకు తన కూతురుకు అన్యాయం జరిగిన దానికే కాకుండా.. ఈ దుస్థితి ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఓ యోధురాలిగా పోరాటం చేసింది. ఇక ఆమె వెంట అండగా ఉంటూ.. వారి తరపున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒకవైపు న్యాయవ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకుంటూ తమ శిక్షను వాయిదా వేసుకుంటూ వచ్చిన దోషులను ఎలాగైనా ఉరికంబం ఎక్కేవరకు వదిలిపెట్టలేదు ఈ మహిళా న్యాయవాది. ఉరిశిక్ష వాయిదా పడిన ప్రతీసారి నిర్భయ తల్లి వెన్నంటి ఉంటూ.. ఆమెలో ధైర్యాన్ని నింపుతూ పోరాటాన్ని సాగించింది. ఇక ఆమెవరో కాదు సీమా ఖుష్వాహ.

2012లో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దగ్గర నుంచి సీమా ఖుష్వాహ ఆశాదేవి కుటుంబానికి అండగా ఉంటూ వచ్చారు. ఎఫ్ఐఆర్, దోషులపై ఛార్జ్‌షీట్ నమోదు చేయడం, వగైరా విషయాలన్నింట్లోనూ ఆమె ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుపై సమర్ధవంతంగా వాదించిన ఈమె ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. కేవలం తన స్నేహితురాలికి సాయం చేస్తున్నానని అనుకుంది. ఇక చివరికి దోషులకు ఉరి వేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కాగా, సీమా ఖుష్వాహా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌ సభ్యురాలుగా ఉన్న సీమా ఈ కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.

For More News:

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం

Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…

Breaking: భారత్‌లో ఐదో కరోనా మరణం..

నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..