AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒప్పందం నుంచి ఇండియా ఔట్.. జపాన్ కూడా..

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సభ్య దేశాల మధ్య స్వేఛ్చా వాణిజ్యానికి సంబంధించిన ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం ‘ (ఆర్సీఈపీ) పై తాను సంతకాలు చేయబోనని జపాన్ ప్రకటించింది . ఈ విషయంలో తాము పూర్తిగా ఇండియా వైపే ఉంటామని.పేర్కొంటూ … . భారత్ కు సంఘీభావంగా నిలిచింది. ఈ తాజా పరిణామం ఒక విధంగా ఇండియాకు పెద్ద ‘ విజయమనే ‘ చెప్పాలి. ఇండియా భాగస్వామ్యం లేనిదే తాను కూడా పార్టనర్ కాలేమని ఈ […]

ఆ ఒప్పందం నుంచి ఇండియా ఔట్.. జపాన్ కూడా..
Anil kumar poka
|

Updated on: Nov 30, 2019 | 12:53 PM

Share

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సభ్య దేశాల మధ్య స్వేఛ్చా వాణిజ్యానికి సంబంధించిన ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం ‘ (ఆర్సీఈపీ) పై తాను సంతకాలు చేయబోనని జపాన్ ప్రకటించింది . ఈ విషయంలో తాము పూర్తిగా ఇండియా వైపే ఉంటామని.పేర్కొంటూ … . భారత్ కు సంఘీభావంగా నిలిచింది. ఈ తాజా పరిణామం ఒక విధంగా ఇండియాకు పెద్ద ‘ విజయమనే ‘ చెప్పాలి. ఇండియా భాగస్వామ్యం లేనిదే తాను కూడా పార్టనర్ కాలేమని ఈ దేశం స్పష్టం చేసింది . ఢిల్లీలో భారత, జపాన్ రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య శనివారం జరుగుతున్నఉన్నతస్థాయి సమావేశం నేపథ్యంలో ముఖ్యంగా ఇండియాకు ఈ దేశం సంఘీభావం ప్రకటించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. జపాన్ ప్రధాని షింజో అబే త్వరలో ఇండియాను విజిట్ చేస్తున్నారు కూడా.. తమ దేశ ప్రయోజనాలకు ఈ డీల్ (ఒప్పందం) ఎంత మాత్రం దోహదపడబోదని భారత ప్రధాని మోదీ ఇటీవల స్పష్టం చేశారు. దీంతో ఈ డీల్ నుంచి మన దేశం వైదొలగింది. ఇందులో భాగస్వాములుగా ఉన్న సుమారు 16 దేశాలు దీనిపై ముందుకు సాగాలని నిర్ణయించాయని చైనా పేర్కొంది . అటు-తాము తిరిగి ఢిల్లీలో భేటీ అవుదామని మోదీ, షింజే అబే గత ఏడాది అక్టోబరులో జపాన్ లో జరిగిన 13 వ భారత-జపాన్ వార్షిక సమ్మిట్ లో నిర్ణయించారు. ఆ మేరకు మొదట ఇప్పుడు ఢిల్లీలో ఉభయ దేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు సమావేశమవుతున్నారు.

అసలు ఈ ఒప్పంద మతలబు ఏమిటి ? ప్రధానంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అన్ని సరుకులకు సంబంధించి స్వేఛ్చావాణిజ్యం జరగాలని ఉద్దేశిస్తూ 2011 నవంబరులో 19 వ ఏషియన్ మీట్ లో దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. అయితే ఈ ఏడాదే దీనినుంచి వైదొలగాలని ఇండియా, జపాన్ నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగస్వాములుగా బ్రూనే, కాంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలున్నాయి. అయితే ఇక ఈ ఒప్పందంలో తాను భాగస్వామి కాదలచుకోలేదని ఇండియా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జపాన్ కూడా తీర్మానించింది. ఇది భారత విదేశాంగ విధానానికి ‘ బూస్ట్ ‘ అని చెప్పవచ్చు.

Follow Us
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్