AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మరో కొత్త పథకం: ‘జగనన్న వైయస్సార్ బడుగు వికాసం’ కి సీఎం శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. ‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి ఈ సందర్భంలో అన్నారు. ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో […]

ఏపీలో మరో కొత్త పథకం:  'జగనన్న వైయస్సార్ బడుగు వికాసం' కి సీఎం శ్రీకారం
Venkata Narayana
|

Updated on: Oct 26, 2020 | 2:36 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త పథకానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. ‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి ఈ సందర్భంలో అన్నారు. ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమ పెట్టాలనుకున్న వారు.. ఎలా ముందుకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌, తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం అన్నారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నామని.. వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫెసిలిటేషన్‌కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు… ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయని సీఎం తెలిపారు.

Follow Us