రైతుకుటుంబాలకు జగన్ భరోసా.. కలెక్టర్లకు ఆదేశాలు

ఆత్మహత్యలతో పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు సహాయమందించడంలో జాప్యంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ జిల్లాకు కోటి రూపాయలు రిజర్వులో వుంచినా ఇంకా చాలా రైతు కుటుంబాలకు సాయమెందుకు అందలేదని ఆయన కలెక్టర్లపై మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల అంశం చర్చకు రాగా జగన్ తీవ్రంగా స్పందించారు. 2014-2018 మధ్యకాలంలో మొత్తం 566 మంది […]

రైతుకుటుంబాలకు జగన్ భరోసా.. కలెక్టర్లకు ఆదేశాలు
Follow us

|

Updated on: Dec 31, 2019 | 2:30 PM

ఆత్మహత్యలతో పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు సహాయమందించడంలో జాప్యంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ జిల్లాకు కోటి రూపాయలు రిజర్వులో వుంచినా ఇంకా చాలా రైతు కుటుంబాలకు సాయమెందుకు అందలేదని ఆయన కలెక్టర్లపై మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల అంశం చర్చకు రాగా జగన్ తీవ్రంగా స్పందించారు.

2014-2018 మధ్యకాలంలో మొత్తం 566 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ కుటుంబాలను ఆదుకోవడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని జగన్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ప్రతీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సాయమందిస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని ఆరోపించారు. అధికారులు అన్నింటినీ పరిశీలించి 566 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారని, మరి పరిహారమందించడంలో జాప్యానికి కారణమేంటని సీఎం కలెక్టర్లను ప్రశ్నించారు.

2014 నుంచి ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఎలాంటి సహాయం అందించని రైతుల కుటుంబాలను పిలిపించి 5 లక్షల రూపాయల చొప్పున ఫిబ్రవరి 12న వారికి చెక్కులనుు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. 2019 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకూ కూడా ఎవరైనా రైతులు బలవన్మరణానికి పాల్పడితే కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలని జగన్ చెప్పారు. ఇలాంటి రైతు కుటుంబాలను గుర్తించేందుకు మార్గదర్శకాలను ఆల్‌రెడీ రూపొందించామని చెప్పారు. కోటి రూపాయలు ప్రతి కలెక్టర్‌ వద్ద పెట్టినప్పటికీ తాత్సారం వల్ల ఇంకా చాలా మందికి డబ్బులు అందని పరిస్థితి ఉందని చెప్పారాయన.

గత ఆరు నెలల కాలంలో 121 మంది ఆత్మహత్య చేసుకుంటే అందులో చాలామందికి డబ్బులు అందలేదని, అలాంటి కుటుంబాలకు 7 లక్షల రూపాయల చొప్పున పరిహారం పంపిణీ చేయాలని జగన్ చెప్పారు. ఈ మొత్తాన్ని అన్‌-ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేయాలని సూచించారు. ఈ డబ్బుమీద అప్పులువాళ్ళు, బ్యాంకులు ఎలాంటి క్లెయిం చేయకూడదని క్లియర్ కట్ చెప్పారు. ప్రతి కలెక్టర్‌ రైతు కుటుంబాల దగ్గరికి స్వయంగా వెళ్ళి, వారికి పరిహారం అందించాలని ఆదేశించారు సీఎం.