AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు..!

మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఇప్పటివరకు అందించిన ఉచిత్ర వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు..!
Ravi Kiran
|

Updated on: Aug 29, 2020 | 2:12 AM

Share

Jagan Government Good News: మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు అందించింది. ఇప్పటివరకు అందించిన ఉచిత వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇది వర్తించనుండగా.. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు వచ్చి పని చేస్తున్న వారికి మాత్రమే ఇది అమలు కానుంది. గతంలో ఈ గడువు 2020, ఆగష్టు 1తో ముగియడంతో.. ఇప్పుడు ఆ గడువును 2021, జూన్ 31వ తేదీ వరకు పొడిగించింది.  (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

రెయిన్ ట్రీ పార్క్‌లోని 3 బెడ్ రూమ్ ఫ్లాట్‌, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లలో సదరు ఉద్యోగినులు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి పరిస్థితులను పరిశీలించి.. ప్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.