AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసిస్ పంజా: ఇండియా, శ్రీలంక టార్గెట్

సిరియా, ఇరాక్‌లలో ప్రాబల్యాన్ని కోల్పోతున్న ఉగ్రసంస్థ ఐసిస్.. తన మకాన్ని మార్చింది. భారత్, శ్రీలంకలే టార్గెట్‌గా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీస్ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఇంటిలిజెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ మూడు లేఖలను పంపారు. అందులో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పటికే మకాం వేశారని.. పలుచోట్ల దాడులు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా చాట్ సెక్యూర్, సిగ్నల్, సైలెంట్ […]

ఐసిస్ పంజా: ఇండియా, శ్రీలంక టార్గెట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 1:37 PM

Share

సిరియా, ఇరాక్‌లలో ప్రాబల్యాన్ని కోల్పోతున్న ఉగ్రసంస్థ ఐసిస్.. తన మకాన్ని మార్చింది. భారత్, శ్రీలంకలే టార్గెట్‌గా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పథకాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీస్ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఇంటిలిజెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ మూడు లేఖలను పంపారు. అందులో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు ఇప్పటికే మకాం వేశారని.. పలుచోట్ల దాడులు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా చాట్ సెక్యూర్, సిగ్నల్, సైలెంట్ టెక్ట్స్ వంటి యాప్‌లను వాడుతూ.. తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఆ లేఖల్లో పేర్కొన్నారు.

దీనిపై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల్లో వందకు పైగా కేరళవాసులు ఐసిస్‌లో చేరారు. ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన యువతను ఆ దారి నుంచి మళ్లించేందుకు 21 కౌన్సిలింగ్ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. వారిలో ఎక్కువగా ఉత్తర కేరళ నుంచి ఉన్నారు అని తెలిపారు. 10 నుంచి 12 ఆన్‌లైన్ హనీ ట్రాప్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్గత భద్రతను పెంచేందుకు జిల్లా పోలీస్ అధికారులను విశేష అధికారాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో 250మంది మరణించిన ఘటన అనంతరం ఉగ్రవాదులపై ఉక్కు పంజా వేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తుందని ఓ అధికారి వివరించారు.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?