AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఊగిసలాటల్లో కొనసాగుతున్న సూచీలు..

Market News: అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.

Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఊగిసలాటల్లో కొనసాగుతున్న సూచీలు..
Ayyappa Mamidi
|

Updated on: Mar 15, 2022 | 10:10 AM

Share

Market News: అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ 200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా.. మరో సూచీ నిఫ్టీ-50.. 50 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ ఫ్లాట్ గా డ్రేడ్ అవుతుండగా.. మిడ్ క్యాప్ సూచీ మాత్రం 85 పాయిట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాటా కన్సూమర్ 3.14% , సిప్లా 2.44%, మారుతీ 2.37%, అల్టాటెక్ సిమెంట్2.14%, మహీంద్రా & మహీంద్రా 1.86%, దివిస్ ల్యాబ్ 1.15%, టాటా మోటార్స్ 1.03%, హీరో మోటో కార్ప్ 0.92% శాతం మేర లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ 3.93%, హిందాల్కో 3.29%, టాటా స్టీల్ 2.56%, జేఎస్డ్యూ స్టీల్ 2.41%, కోల్ ఇండియా 1.66%, ఐఎన్ఎఫ్వై 1.59%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.36%, బీపీసీఎల్ 1.24% కంపెనీల షేర్లు నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

పేటీఎం కంపెనీపై వివిధ వివాదాలు కొనసాగటం షేర్ ధర 70 శాతం మేర పడికోవటం వల్ల కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్ బ్యాంక్ కు చెందిన మునిష్ వర్మ కంపెనీ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో యూపీఐ యూజర్లను పేటీఎం కొత్తగా యాడ్ చేసుకునేందుకు ప్రస్తుతం రిజర్వు బ్యాంకు పెట్టిన ఆంక్షలు ప్రభావం చూపించవని తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..

Corporate Bond Fund: బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తున్న ఆ మ్యూచువల్ ఫండ్స్.. ఏడాదిలో 21% లాభాలు..