అమెరికాలో దారుణం: భారత యువతిపై అత్యాచారం, హత్య

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన యువతిపై..ఉన్మాది అత్యాచారం చేసి అంతమొందించాడు. మృతురాలిని 19 ఏళ్ల  రూత్ జార్జ్‌గా గుర్తించారు. ఆమె యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హైయ్యర్ స్టడీస్ చదువుతోంది. న‌వంబ‌ర్ 23వ తేదీన ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది.  రూత్ మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ గ్యారేజీలో గుర్తించారు. జార్జ్‌‌ను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు.  సీసీ టీవీ విజువల్స్ పరిశీలించిన అనంతరం ఈ మర్డర్ కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. […]

అమెరికాలో దారుణం: భారత యువతిపై అత్యాచారం, హత్య
Follow us

|

Updated on: Nov 26, 2019 | 12:16 PM

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన యువతిపై..ఉన్మాది అత్యాచారం చేసి అంతమొందించాడు. మృతురాలిని 19 ఏళ్ల  రూత్ జార్జ్‌గా గుర్తించారు. ఆమె యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హైయ్యర్ స్టడీస్ చదువుతోంది. న‌వంబ‌ర్ 23వ తేదీన ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది.  రూత్ మృతదేహాన్ని విశ్వవిద్యాలయ పార్కింగ్ గ్యారేజీలో గుర్తించారు. జార్జ్‌‌ను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు. 

సీసీ టీవీ విజువల్స్ పరిశీలించిన అనంతరం ఈ మర్డర్ కేసులో 26 ఏళ్ల డోనాల్డ్ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. అతడిపై ఫస్ట్ డిగ్రీతో పాటు పలు కేసులను నమోదు చేశారు. క్యాంపస్ సమీపంలో నిందితుడు నివసిస్తున్నట్టు సమాచారం. ఆయుధాల దోపిడి కేసులో అతనికి గతంలో 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించిన అనంతరం 2018 డిసెంబర్‌లో పెరోల్‌‌పై  విడుదలయ్యాడు. నిందితుడికి యూనివర్సిటీతో కానీ జార్జ్‌తో కానీ ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం జార్జ్‌ది హైదరాబాద్‌గా తెలుస్తోంది.