AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరీశ్ చొరవతో రైతుల సమస్య పరిష్కారం

ట్రబుల్ షూటర్‌గా పేరున్న తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు తాజాగా ఆ పేరును మరోసారి సార్థకం చేసుకున్నారు. మెతుకుసీమ రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసిన ఓ సమస్యను పరిష్కరించి వారి మన్నన పొందారాయన.

హరీశ్ చొరవతో రైతుల సమస్య పరిష్కారం
Rajesh Sharma
|

Updated on: Nov 04, 2020 | 3:36 PM

Share

Harishrao solves farmers problem: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చొరవతో సంగారెడ్డి జిల్లా చెరుకు రైతుల సమస్య సత్వరమే పరిష్కారమైంది. దాదాపు పది వేల మంది చెరుకు రైతుల సమస్యను పరిష్కరించిన హరీశ్ రావును రైతాంగం ప్రశంసించింది. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో రైతుల సమస్యను పరిష్కరించారు హరీశ్ రావు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు భారీ ఎత్తున చెరుకు పంట వేశారు. అయితే అక్కడి ట్రైడెంట్ షుగర్ ఇండస్ట్రీ యాజమాన్యం చెరుకు రైతులతో కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు. దాంతో తాము కష్టపడి పడించిన చెరుకు పంటను కొనే వారు లేరంటూ పదివేల మంది రైతాంగం ఆందోళనకు గురైంది. ఈ రైతాంగం ప్రతినిధులంతా జిల్లా మంత్రి హరీశ్ రావును ఆశ్రయించారు. దాంతో ఆయన సంగారెడ్డిలో సమావేశం ఏర్పాటు చేసి.. ట్రైడెంట్ షుగర్ ఇండస్ట్రీ యాజమాన్యంతోపాటు సంగారెడ్డి గణపతి షుగర్స్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు.

బుధవారం జరిగిన ఈ సమావేశంలో జహీరాబాద్ ఏరియాలో పండిన చెరుకు పంటను కూడా సంగారెడ్డి గణపతి షుగర్స్ యాజమాన్యంమే కొనుగోలు చేయాలని, సంగారెడ్డి ప్రాంత చెరుకు రైతులకు ఇస్తున్న విధంగానే జహీరాబాద్ రైతులకు ధర చెల్లించాలని హరీశ్ రావు ఆదేశించారు. అదే సమయంలో ట్రైడెంట్ షుగర్ ఇండస్ట్రీ రైతాంగానికి బకాయి పడిన మొత్తాలను కూడా వెంటనే చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. హరీశ్ రావు చూపిన చొరవతో 10 వేల మంది రైతులకు ఊరట లభించిందని రైతు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం