AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఫీజు తగ్గింపు

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు 2020- 2021 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీకి ఒప్పించింది గుజరాత్ ప్రభుత్వం.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఫీజు తగ్గింపు
Balaraju Goud
|

Updated on: Oct 01, 2020 | 6:26 AM

Share

కరోనా మహమ్మారి పుణ్యామాని విద్యాసంవత్సరం రూపురేఖలే మారిపోయాయి. క్లాసు రూముల్లో విద్యార్థులు అడుగుపెట్టకుండానే విద్యా సంవత్సరం సాగిపోతుంది. అటు ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కనీసం విద్యార్థలకు ఫీజులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు 2020- 2021 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీకి ఒప్పించింది. గుజరాత్‌లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్సు ఫీజుల్లో 25 శాతం తగ్గించడానికి అంగీకరించినట్లు ఆ రాష్ర్ట విద్యాశాఖమంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు గానూ ఫీజుల రాయితీకి ఒప్పుకున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలతో విద్యాశాఖ పలుసార్లు జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ తగ్గింపు సీబీఎస్‌ఈ పాఠశాలల్లోనూ వర్తింస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు 30 శాతం మేర ఫీజులు తగ్గించాలని ఒడిశా విద్యాశాఖ అక్కడి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరుపుతుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది. కరోనా కష్ట కాలం విద్యార్థలు తల్లిదండ్రుల బాధలు చూడలేక ప్రభుత్వాలే రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఆర్థికంగా చితికిపోయినవారికి కొంతలో కొంతైనా ఊరట లభించనుంది.

Follow Us
మెటర్నెటీ లీవ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
మెటర్నెటీ లీవ్స్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వర్కర్.. ఇప్పుడేమో తోపు హీరో
ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో వర్కర్.. ఇప్పుడేమో తోపు హీరో
నౌకలు దాటాలంటే పన్ను కట్టాల్సిందే
నౌకలు దాటాలంటే పన్ను కట్టాల్సిందే
శివలింగానికి జలాభిషేకం నిషేధం.. ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో
శివలింగానికి జలాభిషేకం నిషేధం.. ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. అసలు బెండకాయలు ఎలా కట్ చేయాలో తెలుసా?
ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. అసలు బెండకాయలు ఎలా కట్ చేయాలో తెలుసా?
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 75 శాతం తగ్గింపు!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 75 శాతం తగ్గింపు!
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా?ముద్దుపేరు భలే ఉందిగా
ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా?ముద్దుపేరు భలే ఉందిగా
గంభీర్, అగార్కర్ సంచలన నిర్ణయం.. ఆప్లాన్స్ నుంచి వైభవ్ ఔట్..!
గంభీర్, అగార్కర్ సంచలన నిర్ణయం.. ఆప్లాన్స్ నుంచి వైభవ్ ఔట్..!