AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు! ప్రభుత్వ హెచ్చరిక

వరదల వేళ అసాధారణంగా భారీ చేపలు కొట్టుకొస్తుండటంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. వరద నీటిలో పట్టిన, గుర్తుతెలియని చేపలను తినొద్దని సూచించింది. మురుగునీరు, వ్యర్థాలతో కలుషితమైన చేపలను తింటే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలతిరగడం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది..

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు! ప్రభుత్వ హెచ్చరిక
Large Fish Enter Bihar With Nepal Floodwaters
Srilakshmi C
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 10:01 PM

Share

పట్నా, సెప్టెంబర్‌ 1: బీహార్‌లో వరద పరిస్థితులు కొనసాగుతున్న వేళ కొత్త ఆందోళన మొదలైంది. నేపాల్‌ నుంచి వరద నీటితో పాటు కొన్ని ప్రాంతాలకు అసాధారణంగా భారీ చేపలు కొట్టుకొచ్చినట్లు సమాచారం. ఇలాంటి చేపలను తిన్న తర్వాత కొందరు అనారోగ్యానికి గురైనట్లు కూడా వార్తలు రావడంతో బీహార్‌ డెయిరీ, ఫిషరీస్‌ అండ్‌ యానిమల్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఫిషరీస్‌ డివిజన్‌ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వరద నీటిలో పట్టిన చేపలను తినకూడదని అధికారులు ప్రజలను హెచ్చరించారు. వరదల సమయంలో చెరువులు, నదులు, సరస్సులు, ఇతర నీటి వనరుల నుంచి చేపలు బయటకు వచ్చి.. నీటి ప్రవాహంతో చాలా దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలో అవి మురుగునీరు, వ్యర్థాలు, చనిపోయిన జంతువులు, ఇతర కలుషిత పదార్థాలతో ఎక్కువసేపు సంబంధంలోకి రావచ్చు. దీంతో చేపలపై బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లు, ఇతర వ్యాధికారక సూక్ష్మజీవులు చేరే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి కలుషిత చేపలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల వరద పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి.. నీటి వనరుల్లోని సహజ కాలుష్య కారకాలు, వ్యాధికారక అంశాలు తగ్గే వరకు వరద నీటిలో పట్టిన చేపలను వినియోగించవద్దని సూచించారు.

ఆ చేపలు అసలు తినొద్దు.. హెచ్చరిక

వరదల సమయంలో కనిపించే గుర్తుతెలియని లేదా అసాధారణంగా కనిపించే చేపల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఫిషరీస్‌ డివిజన్‌ సూచించింది. వరద నీటిలో పట్టిన చేపలను మార్కెట్లలో కొనడం, అమ్మడం లేదా ఆహారంగా ఉపయోగించడం మానుకోవాలని అధికారులు కోరారు. కొత్తగా కనిపించే లేదా పరిచయం లేని చేపలను.. వాటి జాతి, భద్రతపై సంబంధిత అధికారులు నిర్ధారించే వరకు తినడానికి అనువైనవిగా భావించకూడదని స్పష్టం చేశారు. నేపాల్‌ నుంచి వచ్చిన వరద నీటి ప్రవాహంతో బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు అసాధారణ చేపలు చేరినట్లు వస్తున్న సమాచారంతో.. వాటి గుర్తింపు, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చేపలు తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. కలుషితమైన చేపలను తిన్న తర్వాత కొందరిలో అనారోగ్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని అధికారులు సూచించారు. అదే విధంగా అసాధారణంగా కనిపించే లేదా గుర్తుతెలియని చేపలు కనిపిస్తే జిల్లా ఫిషరీస్‌ అధికారి, స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

వరద నీటిలోని చేపలతో ఎందుకు ముప్పు?

వరదల సమయంలో గుర్తుతెలియని చేపలపై సామాజిక మాధ్యమాల్లో లేదా ఇతర మార్గాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచించారు. ప్రజలు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వరద పరిస్థితులు కొనసాగుతున్నంతకాలం గుర్తుతెలియని చేపలను పూర్తిగా తినకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరద నీరు మురుగునీరు, చెత్త, జంతువుల అవశేషాలు, ఇతర కాలుష్య పదార్థాలను నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ నీటిలో ఉండే చేపలు హానికరమైన సూక్ష్మజీవులు, ఇతర కలుషిత పదార్థాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీరు, సురక్షితమైన ఆహారం, వైద్య సేవలు అందుబాటులో ఉండటం కష్టంగా మారే పరిస్థితుల్లో.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించేందుకు ఈ హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

నేపాల్‌ వరదలతో తీవ్ర నష్టం

బీహార్‌లో ఈ హెచ్చరికకు నేపాల్‌లో కొనసాగుతున్న తీవ్ర వరద పరిస్థితులు కూడా కారణంగా ఉన్నాయి. నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు, ప్రకృతి విపత్తులతో తీవ్ర నష్టం, అంతరాయం ఏర్పడింది. నేపాల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 323 మందికి పైగా విదేశీయులను ఇటీవల సురక్షితంగా తరలించారు. మరోవైపు 39 దేశాలకు చెందిన సుమారు 590 మంది విదేశీయుల జాడ ఇంకా కనిపించకుండా పోయినట్లు అందుబాటులో ఉన్న గణాంకాలు సూచిస్తున్నాయి. నేపాల్‌-బీహార్‌ ప్రాంతంలో వరద నీటి ప్రవాహం కారణంగా జలచరాలు కూడా ప్రభావిత ప్రాంతాలకు చేరుతున్న నేపథ్యంలో.. చేపల భద్రత, నాణ్యతపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వరదలు తగ్గే వరకు వరద నీటిలో పట్టిన చేపలు, ముఖ్యంగా గుర్తుతెలియని, అసాధారణంగా కనిపించే చేపలను తినకపోవడమే సురక్షితం. చేపలు తిన్న తర్వాత అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్