థౌజండ్వాలా: వెయ్యి కౌంట్ దాటిన రేవంత్! గాంధీభవన్లో సంబురం.. అపోజిషన్లో గరంగరం
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ సంబరాలు నిర్వహిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పవర్ఫుల్ ట్రంప్కార్డ్ చేతిలో ఉంది. రాష్ట్రం విడిపోయేటప్పుడు పవర్లో ఉన్న పార్టీగా మరో మేజర్ ఎడ్వాంటేజ్ కూడా ఉంది. కానీ, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. అపోజిషన్కే పరిమితమైంది. అందుకే, థర్డ్ టైమ్ జరిగిన పోరులో జనామోదం పొంది థంపింగ్ విక్టరీ కొట్టి, ఆ కిక్కును ఫుల్టుఫుల్ ఎంజాయ్ చేసింది తెలంగాణలో హస్తం పార్టీ. అందుకే, రేవంత్ పాలనకు వందరోజులు పూర్తయినప్పుడు, ఏడాది కంప్లీట్ ఐనప్పుడు పెద్దసైజు జాతరలా ఘనంగా జరిగాయి సెలబ్రేషన్స్. విమర్శలొచ్చినా వెనక్కు చూడకుండా ముందుకే ఉరికారు సీఎం రేవంత్రెడ్డి. కట్చేస్తే, ఇప్పుడు వెయ్యిరోజుల మైల్స్టోన్ని టచ్ చేశారు. కానీ, ఈసారి థౌజండ్వాలా సెలబ్రేషన్స్ని కొత్తగా ప్లాన్ చేసినట్టున్నారు. ప్లాన్బీని అమల్లో పెట్టినట్టునట్టంది రేవంత్ సర్కార్. ఏమిటా ప్లాన్బీ? ఎవరిని టార్గెట్ చెయ్యడానికి? ప్రోగ్రామ్ థీమ్ ఏంటంటే… అంబర్పేట్లో మూసీనదిపై 52 కోట్లతో కట్టిన బ్రిడ్జిని ప్రారంభించడం. తర్వాత స్పోర్ట్స్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్.. అక్కడ సీఎం రేవంత్రెడ్డి స్పీచ్. కానీ, ఆ స్పీచ్కాపీలోనే ఒక చిన్న ఛేంజ్. చిన్నది కాదు పెద్దదే. మెయిన్ అపోజిషన్ పార్టీ ఊహించిందో లేదో గాని, రేవంత్రెడ్డి నుంచి బిగ్ అండ్ బిగ్గర్ ఛాలెంజ్. నీ పదేళ్ల విధ్వంసం.. నా వెయ్యి రోజుల సుపరిపాలన.. ఎవరెంత తోపో తేల్చుకుందామా అని. 2023 డిసెంబర్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోనియా, రాహుల్, ప్రియాంక సమక్షంలో సీఎంగా రేవంత్రెడ్డి...
