డ్రగ్స్ కేసులో దీపిక మేనేజర్ కు ఎన్సీబీ సమన్లు
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మళ్ళీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె జాడ కనబడకపోవడంతో, ఆమె ఇంటి తలుపులకు అధికారులు నోటీసు అంటించారు. గత నెలలో కూడా కరిష్మాను ఈ దర్యాప్తు సంస్థ విచారించింది. బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు పెను సంచలనం రేపింది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా ఆమె పలువురి పేర్లను ఎన్సీబీకి వెల్లడించింది. వీరిలో […]
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మళ్ళీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె జాడ కనబడకపోవడంతో, ఆమె ఇంటి తలుపులకు అధికారులు నోటీసు అంటించారు. గత నెలలో కూడా కరిష్మాను ఈ దర్యాప్తు సంస్థ విచారించింది. బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు పెను సంచలనం రేపింది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా ఆమె పలువురి పేర్లను ఎన్సీబీకి వెల్లడించింది. వీరిలో సుశాంత్ మాజీ మేనేజర్లు కూడా ఉన్నారు.