AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీ బియ్యపు పిండితో చెక్కలు ఇలా చేయండి.. తినడం అస్సలు ఆపలేరు..

క్రిస్పీ చెక్కల తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కేజీ బియ్యప్పిండితో, సరైన కొలతలు, చిట్కాలతో ఈ సంప్రదాయ పిండివంటను సులభంగా తయారు చేయవచ్చు. కరకరలాడుతూ, బయట కొన్నట్లే ఉండే ఈ చెక్కలు పండుగలకు, టీ టైం స్నాక్‌గా 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిండి కలిపే విధానం నుంచి వేయించే వరకు అన్ని చిట్కాలు ఇందులో ఉన్నాయి.

కేజీ బియ్యపు పిండితో చెక్కలు ఇలా చేయండి.. తినడం అస్సలు ఆపలేరు..
Chekkalu Recipe
Ram Naramaneni
|

Updated on: Jun 03, 2026 | 8:55 AM

Share

కరకరలాడే చెక్కలు (తెలంగాణలో గారెలు అని కూడా పిలుస్తారు) తయారుచేసే సంపూర్ణ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వంటకాన్ని కేవలం కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే, బయట స్వీట్ షాపుల్లో కొన్నంత క్రిస్పీగా, రుచికరంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిండి కలిపే విధానం నుంచి వేయించే వరకు ప్రతి దశలోనూ పాటించాల్సిన చిట్కాలను ఇందులో వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీ ఒక కేజీ బియ్యప్పిండికి సరిపడా కొలతలతో వివరిస్తున్నాం. పిండి క్వాంటిటీని బట్టి ఇతర పదార్థాలను సర్దుబాటు చేసుకోవాలి.

కావలసిన పదార్థాలు (1 కేజీ బియ్యప్పిండికి):

బియ్యప్పిండి: 1 కేజీ, ధనియాలు: పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు: 15 (లేదా ఒక పూర్తి వెల్లుల్లిపాయ), జీలకర్ర: 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి: 6-7,  నానబెట్టిన శెనగపప్పు: అర కప్పు (ఒక గంట ముందు నానబెట్టాలి), నానబెట్టిన పెసరపప్పు: అర కప్పు (ఒక గంట ముందు నానబెట్టాలి), నువ్వులు: 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు: పిడికెడు (సన్నగా తరిగినది), కారం: 2 టీ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా (1.5 నుండి 2 టీ స్పూన్లు), బట్టర్: 2 టేబుల్ స్పూన్లు, గోరువెచ్చని నీళ్లు: పిండి కలపడానికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

1. మసాలా మిశ్రమం: ముందుగా మిక్సీ జార్‌లోకి పావు కప్పు ధనియాలు, 15 వెల్లుల్లి రెబ్బలు (పొట్టు తీసి), ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆరేడు పచ్చిమిర్చిలను వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకుండా, కోర్స్‌గా ఉండేలా చూసుకోవాలి. ధనియాలు వేయడం వల్ల చెక్కలకు మంచి రుచి వస్తుంది.

2. పిండి కలపడం: ఒక పెద్ద గిన్నెలో 1 కేజీ బియ్యప్పిండిని తీసుకోండి. అందులో ఒక గంట ముందు నానబెట్టిన అర కప్పు శెనగపప్పు, అర కప్పు పెసరపప్పును కలపాలి. ఈ పప్పులు చెక్కలకు మంచి రుచిని, కరకరలాడే గుణాన్ని ఇస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం, 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, సన్నగా తరిగిన పిడికెడు కరివేపాకు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, మరియు 2 టేబుల్ స్పూన్ల బట్టర్ వేసి పిండికి బాగా కలపాలి. బట్టర్ వేయడం వల్ల చెక్కలు మరింత క్రిస్పీగా, రుచిగా తయారవుతాయి. బట్టర్ లేకపోయినా క్రిస్పీగానే వస్తాయి కానీ, బట్టర్ వల్ల రుచి పెరుగుతుంది.

3. పిండిని తడపడం: పిండిని కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసి ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని మెత్తగా, మృదువుగా కలపాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా జాగ్రత్తగా కలపాలి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి కనీసం 10 నిమిషాలు పక్కన పెట్టాలి.

4. చెక్కలు ఒత్తడం: పది నిమిషాల తర్వాత, కొద్దిగా నూనెను చేతులకు అప్లై చేసుకుంటూ పిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోవాలి. ఒకేసారి అన్ని పిండి ముద్దలను చేయకుండా, 15-20 ముద్దలు చేసుకున్నాక ఒత్తుకోవడం మంచిది, లేదంటే పిండి ఆరిపోవచ్చు. చెక్కలను రెండు విధాలుగా ఒత్తుకోవచ్చు:

పూరీ ప్రెస్ ద్వారా:

పూరీ మెషీన్‌లో పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ పెట్టి, రెండు వైపులా నూనె రాసి, పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేయాలి. చెక్కలు ఎంత పలుచగా ఒత్తితే అంత క్రిస్పీగా వస్తాయి. ఒకే మందంతో ఉండేలా చూసుకోవాలి.

చేత్తో లేదా రోలర్ సహాయంతో: పూరీ ప్రెస్ లేకపోతే, పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్‌పై నూనె రాసి, పిండి ముద్దను పెట్టి నెమ్మదిగా రోలర్‌తో ఒత్తుకోవచ్చు. ఇలా చేసిన చెక్కలు మెషీన్‌తో చేసిన వాటికంటే కూడా పలుచగా, రౌండ్‌గా రావడానికి అవకాశం ఉంది.

‘5. వేయించడం: ఒక వెడల్పాటి కడాయిలో నూనె తీసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక మాత్రమే ఒత్తుకున్న చెక్కలను నెమ్మదిగా నూనెలో వేయాలి. ఒకేసారి మూడు లేదా నాలుగు చెక్కలను వేసి, హై ఫ్లేమ్‌లో అటూ ఇటూ తిప్పుతూ మంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా వేగిన చెక్కలను నూనె నుండి తీసివేయాలి.

6. నిల్వ: ఈ క్రిస్పీ చెక్కలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు, లేదా టీ టైం స్నాక్‌గా వీటిని ఆస్వాదించవచ్చు.

రెండు టమాటాలు, కప్పు గోధుమపిండితో సాయంత్రం పూట వేడివేడిగా.. ఆహా.. 

Follow Us