అక్కడ.. పోలీసులకు కరోనా సోకితే.. తక్షణమే రూ. లక్ష అడ్వాన్స్..
కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర పోలీస్ శాఖ

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. పోలీసు సిబ్బందిలో ఎవరైనా కరోనా బారిన పడితే… వారి చికిత్స కోసం తక్షణమే రూ.1 లక్ష సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర అదనపు డీజీపీ (అడ్మినిష్ట్రేషన్) సంజయ్ కుమార్ సింఘాల్ ఉత్వర్వులు జారీ చేశారు.
మరోవైపు.. యూనిట్ కమాండర్లతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర డీజీపీ సుబోధ్ కుమార్ ఇప్పటికే దీనిపై మౌఖిక ఆదేశాలు జారీచేశారు. మహారాష్ట్రలో ఎనిమిది మంది అధికారులు సహా ఇప్పటి వరకు 37 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో అత్యధికంగా ముంబై నుంచే కొవిడ్-19కు గురైనట్టు గుర్తించారు. లాక్డౌన్లో విధి నిర్వహణ సందర్భంగా కరోనా సోకిన వారి నుంచి పోలీసు సిబ్బంది వైరస్ బారిన పడినట్టు అనుమానిస్తున్నారు.



