కరోనా ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల కేసులు.. లక్ష 88 వేల మృతులు..
కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలమయింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 26, 92, 105 కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1, 88, 038 మంది ప్రాణాలు కోల్పోగా..7, 38, 419 మంది కోలుకున్నారు.
భారత్ లో ఇప్పటి వరకు 21,700 కరోనా కేసులు నమోదయ్యాయి. 686 మంది ప్రాణాలు కోల్పోగా, 4,325 మంది కోలుకున్నారు.
Also Read: కరోనా పేషెంట్లకు ఆయుర్వేద చికిత్స..!