ఏపీలోని చిన్న చిన్న పట్టణాలకు వ్యాపిస్తున్న కరోనావైరస్: సజ్జల

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించడమే మార్గమమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీలోని చిన్న చిన్న పట్టణాలకు వ్యాపిస్తున్న కరోనావైరస్: సజ్జల
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 9:04 PM

కోవిద్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించడమే మార్గమమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వాలంటీర్లు ఇంటింటింకి తిరిగి సర్వే చేస్తున్నారని చెప్పారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చినవారు ఉంటే ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.

ఇలాంటి తరుణంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. రానున్న పది, పదిహేను రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సజ్జల. అదే విధంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, విద్యుత్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇంత జరుగుతున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుజేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు చేసే రాజకీయాలు మానుకోవాలని చురకలు అంటించారు. తెలుగుదేశంపార్టీ నేతలు దిక్కుమాలిన, ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారన్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసని….. పసుపు కుంకుమ పేరుతో గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని వివరించారు సజ్జల. అప్పుల భారం, వేలకోట్ల పెండింగ్ బిల్లులు రాష్ట్రానికి మిగిల్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

చంద్రబాబు 40 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టారని… ఇక ఇప్పుడేమో డబ్బులు ఉండి కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని చంద్రబాబు మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లలును కూడా ఈ ప్రభుత్వం భరించాల్సి వస్తుందని చెప్పారు. కాంట్రాక్టర్లకు చెల్లింపు చేసింది 800 కోట్ల రూపాయలు మాత్రమేనని….. మేము బిల్లులు చెల్లించిన కాంట్రాక్టర్లు కూడా ఎవరికి దగ్గరో అందరికి తెలుసన్నారు సజ్జల. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి జీతాల చెల్లింపు వాయిదా వేశామని….. అత్యవసర సమయంలో ఉద్యోగులు వారి ఔదార్యాన్ని చాటుకుంటున్నారని వివరించారు. ఉద్యోగులను కించపరిచే విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Latest Articles
మై డియర్‌ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.
మై డియర్‌ దొంగ పై అద్భుతమైన స్పందన.| మహేష్ మూవీకి ముహూర్తం.
మా ప్రేమకు పునాది అదే..: జ్యోతిక.| పెళ్లిపై తొలిసారి పరిణితి.
మా ప్రేమకు పునాది అదే..: జ్యోతిక.| పెళ్లిపై తొలిసారి పరిణితి.
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్‌ శ్రీను..
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్‌ శ్రీను..
ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా
ఆ 14 నియోజకవర్గాలపై ఈసీ స్పెషల్ ఫోకస్.. అదనపు బలగాలతో పహారా
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మీద స్పెషల్ క్రేజ్..
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా మీద స్పెషల్ క్రేజ్..
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో 'DATE' పదాన్ని గుర్తించండి చూద్దాం.
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో 'DATE' పదాన్ని గుర్తించండి చూద్దాం.
ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..
ఏంటి.. సాయి పల్లవి.! మొటిమల వల్లే.. సినిమాలో ఛాన్స్ వచ్చిందా..
'దేవుడా.. ఓ మంచి దేవుడా'..RCB విజయం కోసం అమ్మాయి ప్రార్థన..వీడియో
'దేవుడా.. ఓ మంచి దేవుడా'..RCB విజయం కోసం అమ్మాయి ప్రార్థన..వీడియో
స్టార్ హీరోకు.. భార్య అదిరిపోయే గిఫ్ట్.! వీడియో
స్టార్ హీరోకు.. భార్య అదిరిపోయే గిఫ్ట్.! వీడియో
పేటీఎం యూజర్లకు అప్ డేట్.. యాప్‌లోనే కొత్త యూపీఐ యాక్టివేట్..
పేటీఎం యూజర్లకు అప్ డేట్.. యాప్‌లోనే కొత్త యూపీఐ యాక్టివేట్..