ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 8 లక్షలకు చేరువలో రికవరీలు..
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,783 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది.

Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,783 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది. ఇందులో 24,575 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,92,083 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 14 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,690కు చేరుకుంది. ఇక నిన్న 3,708 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 170, చిత్తూరు 351, తూర్పుగోదావరి 371, గుంటూరు 324, కడప 169, కృష్ణా 425, కర్నూలు 34, నెల్లూరు 86, ప్రకాశం 134, శ్రీకాకుళం 67, విశాఖపట్నం 113, విజయనగరం 70, పశ్చిమ గోదావరి 469 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,744కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 781 మంది కరోనాతో మరణించారు.
#COVIDUpdates: 31/10/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,20,453 పాజిటివ్ కేసు లకు గాను *7,89,188 మంది డిశ్చార్జ్ కాగా *6,690 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 24,575#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HehL6l1Wfm
— ArogyaAndhra (@ArogyaAndhra) October 31, 2020
