Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వేళ.. ట్రంప్ టీంలో ఆరుగురు భారతీయులకు చోటు.. ఎవరో తెలుసా..

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ దేశంలోనే నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి దెబ్బకి అమెరికా ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్లీ పరుగులెత్తించేందుకు వివిధ రంగాల నుంచి 200 మంది ప్రముఖులను తన సలహాదారులుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించుకున్నారు. వీరిని డజన్ పైగా గ్రూప్స్ కింద విడదీసి.. వివిధ రంగాల ద్వారా ఆర్ధిక వ్యవస్థను ఎలా పెంపొందించాలన్న […]

కరోనా వేళ.. ట్రంప్ టీంలో ఆరుగురు భారతీయులకు చోటు.. ఎవరో తెలుసా..
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 15, 2020 | 7:18 PM

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ దేశంలోనే నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి దెబ్బకి అమెరికా ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్లీ పరుగులెత్తించేందుకు వివిధ రంగాల నుంచి 200 మంది ప్రముఖులను తన సలహాదారులుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించుకున్నారు. వీరిని డజన్ పైగా గ్రూప్స్ కింద విడదీసి.. వివిధ రంగాల ద్వారా ఆర్ధిక వ్యవస్థను ఎలా పెంపొందించాలన్న సలహాలు తీసుకోనున్నారు.

ట్రంప్ టీంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఫేస్‌బుక్‌ సీఈఓ జూకర్‌బర్గ్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన అరవింద్ కృష్ణ(ఐబీఎం), సంజయ్ మెహ్రోత్రా(మైక్రాన్), ఒరాకిల్ ల్యారీ ఎలిసన్, ఇండో అమెరికన్ అన్న ముఖర్జీ మొదలగున వారు ఉన్నారు. వీరందరూ అగ్రికల్చర్, బ్యాంకింగ్, కన్‌స్ట్రక్షన్, లేబర్, డిఫెన్స్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ అండ్ బెవేరేజ్స్, హెల్త్ కేర్, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్, టెలికాం, స్పోర్ట్స్ వంటి రంగాలు ద్వారా ఎకానమీ ఎలా సాధించవచ్చునని సలహాలు, సూత్రాలు ఇస్తారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 614,246 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 26,064కు చేరింది.