AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరసన ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి

దేశంలో ఎక్కడా కూడా లైంగిక దాడి ఘటనలు జరుగకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై లేదా ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

నిరసన ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి
Sanjay Kasula
|

Updated on: Oct 02, 2020 | 8:54 PM

Share

దేశంలో ఎక్కడా కూడా లైంగిక దాడి ఘటనలు జరుగకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ముంబై లేదా ఢిల్లీలో మహిళలపై లైంగిక దాడి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

ఈ అంశంలో ఎలాంటి రాజకీయాలు వద్దని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ బాధితురాలికి న్యాయం జరుగాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్, భీమ్ ఆర్మీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని డిామండ్ చేశారు. నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందాలని కోరారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ నేత డీ రాజా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.  అయితే ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న సమయంలో భారీ ర్యాలీ నిర్వహించడంపై ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొనడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్