AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు..ఎన్‌సీపీని కాపాడేందుకు ఆ దేశంలోకి చైనా దూతల ఎంట్రీ

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలికను నివారించడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నలుగురు కీలకనేతలను నేపాల్‌ పంపించారు. అయితే వాళ్లతో నేపాల్‌ ప్రధాని ఓలి చర్చలు జరుపుతారా ? లేదా ? అన్న విషయంపై సస్పెన్స్‌..

నేపాల్ రాజకీయాల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు..ఎన్‌సీపీని కాపాడేందుకు ఆ దేశంలోకి చైనా దూతల ఎంట్రీ
Sanjay Kasula
|

Updated on: Dec 26, 2020 | 10:31 PM

Share

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలికను నివారించడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నలుగురు కీలకనేతలను నేపాల్‌ పంపించారు. అయితే వాళ్లతో నేపాల్‌ ప్రధాని ఓలి చర్చలు జరుపుతారా ? లేదా ? అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది.

సరిహద్దుల్లో డ్రాగన్‌ కంత్రీ పనులు కొనసాగుతున్నాయి. నేపాల్‌ రాజకీయాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నేపాల్ పార్లమెంట్ ను రద్దైన తర్వాతి పరిణామాలను చైనా అత్యంత నిశితంగా గమనిస్తోంది.

ప్రధాని కేపీ ఓలీ శర్మ, ప్రచండ మధ్య ముదిరిన విభేదాలు కాస్తా… చీలిక వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రాకుండా ఉండేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్‌కు నలుగురు సభ్యుల టీమ్‌ను పంపించారు. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీలు చీలిక దిశగా వెళితే మాత్రం… దానిని నివారించే బాధ్యతను జిన్‌పింగ్ ఆ టీమ్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

చైనా రాయబారి హావో యాంకీ రాయబారం విఫలం కావడంతోనే జిన్‌పింగ్ ఈ బృందాన్ని ఎంపిక చేసి, నేపాల్‌కు పంపించారని చెబుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, మంత్రి గువో యేచౌ సారథ్యంలో ఈ టీమ్ నాలుగు రోజుల పాటు ఖాట్మాండులోనే బస చేయనుంది. అయితే ఇప్పటికే చైనా రాయబారి హావో యాంకీ అటు కేపీ శర్మ ఓలీ, ప్రచండతో భేటీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అయితే హావో యాంకీ ప్రతిపాదనను ప్రధాని శర్మ తిరస్కరించినట్లు తెలుస్తోంది. చైనా రాయబారి హావో యాంకీతో భేటీ కావడానికే తిరస్కరించిన ఓలీ… చైనా అధ్యక్షుడు పంపిన ప్రతినిధులతో భేటీ అవుతారా? అన్నది అనుమానమే అని ఆయన వర్గం పేర్కొంటోంది. తమ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటే కుదరదని ఇప్పటికే ఓలీ తెగేసి చెప్పారు.

అయితే చైనా రాయబారి ఓలీ క్యాంపు నేతలతో టచ్‌లోనే ఉన్నారని, కానీ… ఓలీ మాత్రం టచ్‌లోకి రావడం లేదని తెలుస్తోంది. ఓలీ ప్రత్యర్థి ప్రచండతో మాత్రం పలు దఫాలుగా చర్చలు జరిపింది. పార్లమెంట్‌ను రద్దు చేయాలంటూ ఓలీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ పార్లమెంట్‌ను రద్దు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..