AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నైకి బ‌య‌లుదేరిన రైనా…

ఐపీఎల్ జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ముంద‌స్తుగా శిక్ష‌ణ శిబిరం ప్రారంభించనుంది.చెన్నై సూపర్ కింగ్స్ ఆట‌గాళ్లు సురేశ్ రైనా, దీప‌క్ చాహ‌ర్‌, పియూష్ చావ్లా, బ‌రింద‌ర్ శ్రాణ్ , చెన్నైకి చేరుకుంటున్నారు.

చెన్నైకి బ‌య‌లుదేరిన రైనా...
Sanjay Kasula
|

Updated on: Aug 14, 2020 | 7:00 PM

Share

Suresh Raina Leaves for Chennai : మరికొద్ది రోజుల్లో కలర్ ఫుల్ గేమ్ ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. ఇందు కోసం ఐపీఎల్ జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ ముంద‌స్తుగా శిక్ష‌ణ శిబిరం ప్రారంభించనుంది. ఇందు కోసం ఆ జట్టు సభ్యులు చెన్నైకు బయలు దేరారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆట‌గాళ్లు సురేశ్ రైనా, దీప‌క్ చాహ‌ర్‌, పియూష్ చావ్లా, బ‌రింద‌ర్ శ్రాణ్ , చెన్నైకి చేరుకుంటున్నారు. వ‌చ్చే నెల 19 నుంచి యూఏఈ వేదిక‌గా జ‌రుగనున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 13 వ సీజ‌న్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ఆగ‌స్టు 15 నుంచి 20 వ‌ర‌కు చెపాక్ స్టేడియంలో ధోనీ సేన ప్రాక్టీస్ చేయ‌నుంది.

ఇందుకోసం ఈ న‌లుగురు ఆట‌గాళ్లు విమానంలో చెన్నైకి బ‌య‌లుదేరారు. ఆట‌గాళ్ల‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన రైనా `చెన్నైకి బ‌య‌లుదేరాం. ధ‌న్య‌వాదాలు… విస్తారా.. మ‌మ్మ‌ల్ని చెన్నై తీసుకెళ్తున్నందుకు` అని పోస్ట్ చేశారు. ఈ శిబిరం కోస‌మే తాజాగా MS ధోనీ క‌రోనా వైర‌స్ ప‌రీక్ష చేయించుకోగా.. అందులో నెగిటివ్ అని తేలింది. రేప‌టి నుంచి ఆరు రోజుల పాటు దేశీయ ఆట‌గాళ్ల కోసం ప్ర‌త్యేక క్యాంప్ నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న ధోనీదేనని ఫ్రాంచైజీ యాజ‌మాన్యం తెలిపింది.

View this post on Instagram

Thank you so much @vistara for taking us to Chennai!!!

A post shared by Suresh Raina (@sureshraina3) on