AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవినీతిరహిత పాలనే మోదీ లక్ష్యం: బీజేపీ నేతలు

వాషింగ్‌టన్ డీసీలో అంగరంగ వైభంగా జరుగుతున్న ‘తానా’ మహా సభలకు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంపీలు సీఎం రమేష్, కోరుముట్ల శ్రీపాస్, పువ్వాడ అజయ్, భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రాం మాధవ్ మాట్లాడుతూ.. మన దేశానికి మంచి రాజకీయాలు రావాలి.. ఇందుకోసమే పీఎం మోదీ కృషి చేస్తున్నారన్నారు. నూతన భారతాన్ని నిర్మించే లక్ష్యంతో శ్రమిస్తున్నారని.. […]

అవినీతిరహిత పాలనే మోదీ లక్ష్యం: బీజేపీ నేతలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 08, 2019 | 7:44 AM

Share

వాషింగ్‌టన్ డీసీలో అంగరంగ వైభంగా జరుగుతున్న ‘తానా’ మహా సభలకు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంపీలు సీఎం రమేష్, కోరుముట్ల శ్రీపాస్, పువ్వాడ అజయ్, భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రాం మాధవ్ మాట్లాడుతూ.. మన దేశానికి మంచి రాజకీయాలు రావాలి.. ఇందుకోసమే పీఎం మోదీ కృషి చేస్తున్నారన్నారు. నూతన భారతాన్ని నిర్మించే లక్ష్యంతో శ్రమిస్తున్నారని.. ఇందులో భాగంగా.. బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్‌ను నిర్మించుకోవాలన్నారు. ఐకమత్యంతో కూడిన యునైటెడ్ ఇండియా కావాలన్నారు. అవినీతిరహితమైన పాలనే మోదీ లక్ష్యమన్నారు రాంమాధవ్.