అప్పు చేసి తప్పు చేస్తే కేసు ఎందుకు పెట్టరు? బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో బీజేపీ నేత

ఏపీ ఆర్థికపరిస్థితిపై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. టీవీ9 బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేధికగా జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత రఘురామ్ వైసీపీ, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని. రాష్ట్రానికి చేసిన అప్పుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని.. కానీ నిజాలు ఎంటో ప్రజలకు వివరించడం లేదని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారని.. […]

అప్పు చేసి తప్పు చేస్తే కేసు ఎందుకు పెట్టరు? బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో బీజేపీ నేత
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 8:53 AM

ఏపీ ఆర్థికపరిస్థితిపై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. టీవీ9 బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేధికగా జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత రఘురామ్ వైసీపీ, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని. రాష్ట్రానికి చేసిన అప్పుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని.. కానీ నిజాలు ఎంటో ప్రజలకు వివరించడం లేదని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారని.. ఆ తర్వాత చంద్రబాబుపై వైసీపీ ఆరోపణలు చేసిందని.. కానీ ఇరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు.. నిజంగా అప్పు చేసి తప్పు చేస్తే వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికలో వైసీపీ నుంచి ఈద రాజశేఖర్, టీడీపీ నుంచి మాల్యాద్రిలు పాల్గొన్నారు.

ఇవాళ ఉదయం టీడీపీని టార్గెట్ చేస్తూ.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అప్పులతో.. రాష్ట్రానికి అప్పులు తీసుకురాలేని పరిస్థితిని తెచ్చారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల తప్పుల్ని.. మూడు నెలల్లోనే ఎలా సరిదితద్దుతామంటూ ప్రశ్నించారు. రూ. 38వేల కోట్లు సప్లిమెంటరీ గ్రాంట్లు, 40వేల కోట్ల పెండింగ్‌ బిల్స్‌, 65 వేల కోట్ల చెల్లించాల్సిన అప్పులు ఇచ్చి వెళ్లారని విమర్శింంచారు. ఎన్నికలకు ముందు ఆర్నెల్లలో కాంట్రాక్టర్లకు 7వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించారని విమర్శించారు. టీడీపీ హయాంలో డిస్కమ్‌లకు 14,857 కోట్ల రూపాయల నిధులు పెండింగ్‌లో పెట్టారని అన్నారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో కనీసం 165 శాతం పెరగాల్సిన తలసరి ఆదాయం, కేవలం 70 శాతమే పెరిగిందని విమర్శించారు.

ఇక టీడీపీ నేతలే ఎన్నికల ముందు అప్పు పుట్టదని ప్రచారంలో యనమల అన్నారని డిబేట్‌లో వైసీపీ నేత ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుందని ఈద రాజశేఖర్ అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన అప్పులకు అప్పు కూడా పుట్టకుండా పరిపాలించి వెళ్లారంటూ ఆరోపించారు. దీనిపై టీడీపీ నేత మాల్యాద్రి కౌంటర్ అటాక్ చేశారు. బుగ్గన రాజేంద్ర ఇచ్చిన శ్వేత పత్రంలోనే టీడీపీ అప్పుల రేషియో 2014 కంటే 2018-19లో తగ్గిందన్నారు. 2014లో టీడీపీ హయాంలో 28.25గా ఉన్న అప్పుల రేషియో.. 2018-19లో 28.12కు తగ్గిందని అన్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?