డాక్టర్ హుస్సేన్ స్టోరీ: ‘హైదరాబాద్లో కిడ్నాప్.. అనంతలో చేజింగ్’
హైదరాబాద్లో నిన్న కిడ్నా ప్ అయిన డాక్టర్ హుస్సేస్ మిస్సింగ్ కేసుకి అనంతపురంలో ఇవాళ(బుధవారం) ఎండ్ కార్డ్ పడింది. అనంతపురం జిల్లా పోలీసులు డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి రక్షించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో ఉండే దంత వైద్యుడు హుస్సేన్ నిన్న కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాక్టర్.. “నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ఐదుగురు బుర్కా వేసుకొని క్లినిక్ లోకి వచ్చారు. రావడంతోనే నాపై దాడి చేశారు.. వారినుంచి తప్పించుకునే ప్రయత్నం […]
హైదరాబాద్లో నిన్న కిడ్నా ప్ అయిన డాక్టర్ హుస్సేస్ మిస్సింగ్ కేసుకి అనంతపురంలో ఇవాళ(బుధవారం) ఎండ్ కార్డ్ పడింది. అనంతపురం జిల్లా పోలీసులు డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి రక్షించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో ఉండే దంత వైద్యుడు హుస్సేన్ నిన్న కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాక్టర్.. “నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ఐదుగురు బుర్కా వేసుకొని క్లినిక్ లోకి వచ్చారు. రావడంతోనే నాపై దాడి చేశారు.. వారినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను.. ఆ క్రమంలో నా చేతికి గాయం అయింది.. నా ఇనోవా కారు రివర్స్ తీసుకొచ్చి అందులో ఎక్కించారు.. కొద్దిదూరం తీసుకెళ్లిన తర్వాత ఆటోలో కి మార్చారు.. ఆ తర్వాత ఒక రూమ్ లోకి నన్ను తీసుకెళ్లారు.. అక్కడి నుండి బొలెరో వెహికల్ లో తీసుకువచ్చారు.. నువ్వు మాకు సహకరిస్తే నిన్ను ఏమి చేయమని చెప్పారు.. తర్వాత తాళ్లతో కట్టేసి ముఖానికి మాస్క్ పెట్టారు.. అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా కిడ్నాప్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు.” అని డాక్టర్ టీవీ9కు వెల్లడించారు. కాగా, డాక్టర్ హుస్సేన్ ను పోలీసులు రక్షించగా, ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను ఎస్పీ సత్యయేసుబాబు అలర్ట్ చేశారు.