అంగరంగ వైభవంగా ఆకాశ్-శ్లోకాల వివాహం
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్-శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. చిన్ననాటి స్నేహితులైన ఆకాశ్-శ్లోకాలు ప్రముఖుల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు.ఈ వేడుకకు రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు ఆమిర్ ఖాన్-కిరణ్ రావు దంపతులు, జుహీ చావ్లా, ఐశ్వర్య రాయ్ కుటుంబం, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రజినీకాంత్, సౌందర్య-విశాఖన్ దంపతులు, రణ్బీర్ […]
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్-శ్లోకాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ సెంటర్ ఈ వేడుకకు వేదికైంది. చిన్ననాటి స్నేహితులైన ఆకాశ్-శ్లోకాలు ప్రముఖుల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోయారు.ఈ వేడుకకు రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
బాలీవుడ్ ప్రముఖులు ఆమిర్ ఖాన్-కిరణ్ రావు దంపతులు, జుహీ చావ్లా, ఐశ్వర్య రాయ్ కుటుంబం, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రజినీకాంత్, సౌందర్య-విశాఖన్ దంపతులు, రణ్బీర్ కపూర్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, షారుక్ ఖాన్-గౌరీ దంపతులు, టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్ -అంజలి, జహీర్ ఖాన్-సాగరిక, యువరాజ్ సింగ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్-కేరీ దంపతులు, ఐరాస మాజీ జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్-అంజలీ పిచాయ్ దంపతులు, వ్యాపార వేత్త లక్ష్మి మిత్తల్ తదితరులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు తరలి వచ్చారు. మూడు రోజుల పాటు వివాహ వేడుకలు కొనసాగనున్నాయి. వివాహ వేదిక వద్దకు ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని అంబానీ కుటుంబం ముందే అతిథులను కోరింది.