AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మదురై ఎయిమ్స్ బోర్డులో వివాదాస్పద డాక్టర్ నియామకం

ఏబీవీపీ నాయకుడు, ఆంకాలజిస్ట్ కూడా అయిన సుబ్బయ్య షణ్ముగం అనే డాక్టర్ ను కేంద్రం మదురైలోని ఎయిమ్స్ బోర్డు సభ్యునిగా నియమించింది. కొన్ని నెలల క్రితం ఇతగాడు చెన్నైలో ఓ వృధ్ద మహిళ ఇంటివద్ద మూత్ర విసర్జన చేశాడని, ఆమెను వేధించాడని, వాడేసిన మాస్కులను ఆమె ఇంటి తలుపు వద్ద పడేశాడని ఇతనిపై ఆరోపణలున్నాయి.  కానీ వీటిని పక్కనపెట్టి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా ఈ నియామకం చేసింది. చెన్నైలోని ఓ మెడికల్ […]

మదురై ఎయిమ్స్ బోర్డులో వివాదాస్పద డాక్టర్ నియామకం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 28, 2020 | 8:55 PM

Share

ఏబీవీపీ నాయకుడు, ఆంకాలజిస్ట్ కూడా అయిన సుబ్బయ్య షణ్ముగం అనే డాక్టర్ ను కేంద్రం మదురైలోని ఎయిమ్స్ బోర్డు సభ్యునిగా నియమించింది. కొన్ని నెలల క్రితం ఇతగాడు చెన్నైలో ఓ వృధ్ద మహిళ ఇంటివద్ద మూత్ర విసర్జన చేశాడని, ఆమెను వేధించాడని, వాడేసిన మాస్కులను ఆమె ఇంటి తలుపు వద్ద పడేశాడని ఇతనిపై ఆరోపణలున్నాయి.  కానీ వీటిని పక్కనపెట్టి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా ఈ నియామకం చేసింది. చెన్నైలోని ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సర్జికల్ ఆంకాలజి విభాగం హెడ్ అయిన సుబ్బయ్య గారు  యధాప్రకారం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశాడు. తన వృత్తిగతమైన అర్హత ఆధారంగా ఎయిమ్స్ బోర్డులో సభ్యునిగా నియమించారని పేర్కొన్నాడు.