ఎప్పుడో కనుమరుగైన చరిత్ర ఇప్పటికీ రగులుతోంది.. దురాక్రమణదారులా? హీరోలా?
వెయ్యేళ్ల నాటి చారిత్రక పాత్రలు ఇప్పటికీ వివాదం అవుతున్నాయి.. ఎందుకు? రాజకీయ నాయకులు గత చరిత్రపై మంటలు పుట్టిస్తూనే ఉన్నారు.. ఎందుకు? చరిత్రలో వాస్తవాలే ఉన్నాయా? లేదా వక్రీకరణ జరిగిందా? ఏది నిజం, ఏది చరిత్ర. ఒకప్పటి చరిత్ర ఇప్పటి రాజకీయాల్లోకి ఎందుకని ప్రవేశిస్తోంది? ఒకసారి తెలుసుకుందాం..

చరిత్రలో ఉన్నవన్నీ నిజాలు కాదు, అందులో రాయనంత మాత్రాన అబద్ధం అనడానికీ లేదు. హిస్టరీ బుక్స్లో ఉన్నవి వాస్తవాలు-అవాస్తవాలు అనుకోవడమే ఒక భ్రమ. ఎందుకంటే.. వాటిని చూసే కోణం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కాబట్టి. ఆ కారణంగానే.. వెయ్యేళ్లైనా వారి చరిత్రపై రగడ జరుగుతూనే ఉంటుంది. ఔరంగజేబుపై జరుగుతున్న రాద్ధాంతమే తీసుకుందాం. మొఘల్స్ ఆఖరి నవాబు ఔరంగజేబు ఒక గొప్ప పాలకుడు, దేవాలయాలు సైతం నిర్మించాడంటూ కామెంట్ చేశారు మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ చీఫ్ అబు అజ్మీ. ఆ ఒక్క మాటతో మహారాష్ట్ర బీజేపీ రగిలిపోయింది. ఔరంగజేబు నిజంగా అంతమంచి పాలకుడే అయితే.. ఆ సమాధిని తమ ఇళ్లల్లో పెట్టుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ నవనీత్ కౌర్. అలాగే, అయోధ్య-బాబ్రీ మసీద్ విషయంలో ఎంత రగడ జరిగిందో చూశాం. కొన్ని దశాబ్దాల పాటు రగిలిపోయింది ఆ ఇష్యూ. అంతకుముందు.. రాహుల్గాంధీ బాబర్ సమాధిని సందర్శించిన ఘటన పెద్ద చర్చకు దారి తీసింది. 2005లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి బాబర్ సమాధిని సందర్శించి వచ్చారని నానాయాగీ చేసింది బీజేపీ. కొన్నేళ్ల క్రితం పాక్ జాతిపిత అయిన జిన్నాను పొగుడుతూ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కామెంట్ చేశారు. దేశాన్ని విభజించిన జిన్నాను ఎలా కీర్తిస్తారంటూ బీజేపీ మండిపడింది. జిన్నాను కొనియాడినందుకే తమను విమర్శిస్తే.. మరి ఎల్కే అద్వానీ జిన్నా సమాధికి చాదర్ సమర్పించారు కదా దానికేం అంటారని రివర్స్ కౌంటర్ వేశారు. ఇక టిప్పు సుల్తాన్ చరిత్రపైనా...




