AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్ల తర్వాత నీటి తడి తగిలినా చాలు మళ్లీ బతికేస్తాయి

ఎలుగుబంటి ఆకారంలో మిల్లీమీటర్ కంటే తక్కువ పొడవుండే టార్డిగ్రేడ్లు చంద్రుడిపై సజీవంగా ఉన్నాయని ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ తెలిపింది. 2019లో ఇజ్రాయిల్ అంతరిక్ష వాహనం కూలిపోయినప్పటికీ, ఈ మహా మొండి జీవులు అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను, దశాబ్దాలపాటు ఆహారం లేకుండా బతకగలవు. నీటి తడి తగలగానే 30 ఏళ్ల తర్వాత కూడా మామూలు స్థితికి వచ్చేస్తాయి.

30 ఏళ్ల తర్వాత నీటి తడి తగిలినా చాలు మళ్లీ బతికేస్తాయి
TardigradesImage Credit source: Science Photo Library
Ram Naramaneni
|

Updated on: May 30, 2026 | 3:06 PM

Share

చంద్రగ్రహం ఇప్పుడు వేలాది మొండి జీవులకు అనూహ్య ఆవాసంగా మారే అవకాశం ఉంది. ఎలుగుబంటి ఆకారంలో, మిల్లీమీటర్ కంటే తక్కువ పొడవుండే ఈ సూక్ష్మజీవులు, టార్డిగ్రేడ్లు లేదా వాటర్ బేర్స్ అని పిలువబడేవి, చంద్రుడిపై సజీవంగా ఉన్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ చాలాకాలం క్రితమే తెలిపింది. 2019 ఏప్రిల్‌లో ఇజ్రాయిల్ పంపిన అంతరిక్ష వాహనం చంద్రునిపై కూలిపోయినప్పుడు, అందులోని టార్డిగ్రేడ్లు కూడా చంద్రుని ఉపరితలంపై చేరాయి. టార్డిగ్రేడ్లు అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. అవి సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి 150 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు, అంతేకాదు, దశాబ్దాల పాటు ఆహారం లేకుండా కూడా జీవించగలవు. అందుకే వీటిని మహా మొండి జీవులు అని పిలుస్తారు. ఆర్చ్ మిషన్ ఫౌండేషన్, మానవ మేధో సంపత్తిని, భూమిపై ఉండే అరుదైన జీవుల అవశేషాలను సౌరవ్యవస్థలోని వివిధ ప్రదేశాలకు పంపుతూ ఉంటుంది.

2023లో టార్డిగ్రేడ్స్‌ను చంద్రమండలానికి పంపినపుడు, వాటితో పాటు మానవ చరిత్రకు సంబంధించిన మూడు కోట్ల పేజీల సమాచారం నిక్షిప్తమై ఉన్న ఒక డీవీడీని కూడా రోబోటిక్ ల్యాండర్ చంద్రుని మీదకు మోసుకువెళ్ళింది. ఈ టార్డిగ్రేడ్స్‌ను నీరు లేకుండా బాగా ఎండబెట్టి అంతరిక్షంలోకి పంపించారు. శరీరంలో నీరు లేకుండా ఏ జీవులు ఎక్కువ కాలం బతకలేవు. కానీ టార్డిగ్రేడ్లు చాలా మొండి జీవులు. ఎండబెట్టాక 20, 30 ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా వెంటనే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి ఎండిపోయినప్పుడు, తలలు, ఎనిమిది కాళ్లను లోపలికి లాక్కుని చిన్న బంతి లాగా మారుతాయి. ఈ దశలో వాటి శరీరంలోని నీటినంతా త్యజిస్తాయి, జీర్ణక్రియ రేటు మామూలు స్థితితో పోల్చితే 0.01 శాతానికి పడిపోతుంది. ఈ పరిస్థితిలోనూ అవి కొన్ని దశాబ్దాల పాటు ప్రాణంతో ఉండగలవు. 2007లో కూడా ఆర్చ్ మిషన్ సంస్థ ఈ జీవులను అంతరిక్షంలోకి పంపింది. భూగోళం మీద అత్యంత మొండివిగా పేరున్న టార్డిగ్రేడ్స్‌ను అంతరిక్షంలోకి పంపడం ఉత్తమమని ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ అధినేత నోవా స్పివాక్ అన్నారు. అయితే, ప్లానెటరీ అండ్ స్పేస్ సైన్సెస్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోనికా గ్రాడీ ప్రకారం, టార్డిగ్రేడ్లు చంద్రుడి మీద ప్రాణంతో ఉండగలిగినా, ఆ గ్రహం మీది వాతావరణం కారణంగా వాటి పరిస్థితి గొప్పగా ఏమీ ఉండకపోవచ్చు. చంద్రునిపై ఎండిన దశలో సురక్షితంగా దిగినా, నీటి తడి తగిలేంత వరకు అవి మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో ఈ జీవులను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చి పరీక్షిస్తే, చంద్రమండలంలోని వాతావరణ ప్రభావం వాటి మీద ఎలా ఉందో అధ్యయనం చేసేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గుడ్లను కాపాడేందుకు నెలన్నర పాటు గూడు నుంచి కదలదు.. అరుదైన సర్పం.. 

Follow Us