Chanakya Niti: ఆచార్య చాణక్య ఇల్లు నిర్మించుకోవాలంటే ఎటువంటి ప్రదేశం.. వాతావరణం ఉండాలని చెప్పారంటే..

Chanakya Niti: ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడు. దీనితో పాటు ఆయనకు నీతిశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన విధానాలు కాలం మారినా చెక్కు చెదరనివి. ప్రతి మానవుడూ ఆచరించ దగ్గవి.

Chanakya Niti: ఆచార్య చాణక్య ఇల్లు నిర్మించుకోవాలంటే ఎటువంటి ప్రదేశం.. వాతావరణం ఉండాలని చెప్పారంటే..
Chanakya Niti
Follow us

|

Updated on: Jun 09, 2021 | 8:55 PM

Chanakya Niti: ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడు. దీనితో పాటు ఆయనకు నీతిశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన విధానాలు కాలం మారినా చెక్కు చెదరనివి. ప్రతి మానవుడూ ఆచరించ దగ్గవి. కాలంతో పాటు ఆచార్య చాణక్య విధానాలు కూడా నడుస్తోనే ఉంటాయి. ఆచార్య చాణక్య తన విధానాలను జీవితంలోని ప్రతి అంశంపై ప్రస్తావించారు. ఏ వ్యక్తి అయినా వారి విధానాలను అనుసరించి విజయవంతమైన,సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటారు. ఆయన ప్రస్తావించిన విషయాల్లో ఇంటి గురించి.. భూమి గురించి కొన్ని ప్రత్యెక విషయాలు ఉన్నాయి. ఇల్లు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన అప్పట్లోనే విస్పష్టంగా తెలిపారు. అవి ఈరోజుకూ అమోదయోగ్యంగానూ,ఆచరణ యోగ్యంగానూ ఉంటాయి.

ఇల్లు కొనడం గురించి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి..

ధనవంతులు నినివసించే చోట..

ధనవంతులు నివసించే ప్రాంతాల్లో నివసించడం చాలా మంచిది అని చాణక్యుడు చెప్పాడు. అటువంటి ప్రదేశంలో వ్యాపరావకాశాలు ఎక్కువ ఉంటాయట. అదేవిధంగా ధనవంతులు నివసించే ప్రాంతంలో నివసిస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయని చాణక్యుడు చెబుతారు.

మత విశ్వాసాలు..

మత విశ్వాసాలు పాటించే ప్రాంతంలోనూ.. భగవంతుని పై భయం ఉన్న చోట ఇంటిని నిర్మించుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. దీనివలన ప్రజలు భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి జీవిస్తారు. ప్రజలలో సామాజిక గౌరవం పెరుగుతుంది. సంస్కారయుతంగా మెలగడం నేర్చుకుంటారు. అందుకని అటువంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మించుకోవడం మంచిదని ఆచార్య చాణక్య చెబుతారు.

చట్టం అంటే భయం ఉన్న చోటు..

ప్రజలు చట్టం మరియు సమాజం పట్ల భయపడే చోట ఒక వ్యక్తి నివసించాలని చాణక్య అంటారు. ఈ రెండింటి విషయంలో భయం లేని వ్యక్తుల మధ్య ఎట్టిపరిస్థతిలోనూ ఉండకూడదని చాణక్య ఉవాచ. దానివలన మంచి వ్యక్తులు కూడా చిక్కుల్లో పడాల్సి వస్తుంది.

వైద్యులు ఉన్న ప్రదేశానికి దగ్గరగా..

ఆచార్య చాణక్య సమీపంలో వైద్యులు లేదా వైద్యులు ఉన్నచోట నివాసానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెబుతారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే.. అకస్మాత్తుగా అనారోగ్యం పాలైతే కాపాడటానికి వైద్యులు దగ్గరలో ఉండాల్సిన అవసరం ఉంది.

నదికి దగ్గరలో..

నదికి దగ్గరలో మనిషి జీవించడం చాలా ముఖ్యం అంటారు ఆచార్య చాణక్య. ఎందుకంటే, అక్కడ ఇల్లు ఉంటె.. మంచి వాతావరణం లభిస్తుంది. పర్యావరణం ప్రశాంతంగా ఉంటుంది. అంటారు చాణక్య.

Also Read: Indian Tiger : భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిన ఇండియన్ టైగర్..! నాలుగు నెలల పాటు 100 కిలోమీటర్ల ప్రయాణం..

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం.. కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే ఉద్యోగికి 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్!

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు