Vaccination: టీకాతో ఆ దేశాల్లో ఆగిన కరోనా కల్లోలం..వ్యాక్సిన్ ప్రభావం ఆ ఆరు దేశాల్లో ఎలా పనిచేసింది?

దేశవ్యాప్తంగా కరోన కల్లోలం చాలా ఎక్కువగా ఉంది. ఎన్నడూ లేని విధంగా కేసులు పెరిగిపోయాయి. ప్రతిరోజూ లక్షల్లో కేసులు.. వందల్లో మరణాలు రికార్డు అవుతున్నాయి.. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

Vaccination: టీకాతో ఆ దేశాల్లో ఆగిన కరోనా కల్లోలం..వ్యాక్సిన్ ప్రభావం ఆ ఆరు దేశాల్లో ఎలా పనిచేసింది?
Vaccination
Follow us

|

Updated on: Apr 23, 2021 | 5:36 PM

Vaccination: దేశవ్యాప్తంగా కరోన కల్లోలం చాలా ఎక్కువగా ఉంది. ఎన్నడూ లేని విధంగా కేసులు పెరిగిపోయాయి. ప్రతిరోజూ లక్షల్లో కేసులు.. వందల్లో మరణాలు రికార్డు అవుతున్నాయి.. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అయితే, ఇదే పరిస్థితి కొన్ని రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉండేది. బ్రిటన్, స్పెయిన్, అమెరికా, ఇజ్రాయెల్, ఇటలీ వంటి దేశాలలో, కరోనా వేగం ఈ రోజు భారతదేశంలో ఉన్నంత వేగంగా ఉండేది. ఇప్పుడు మనదేశంలో ఉన్నట్టుగానే అప్పుడు ఆయా దేశాల్లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పిపిఇ కిట్ల సంక్షోభం తీవ్రంగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. దీనికి కారణం ఒక్కటే.. అదే వ్యాక్సిన్! అవును ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయడం ద్వారా కరోనాను నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా దేశాలు అన్నిటికన్నా ముఖ్యంగా వ్యాక్సినేషన్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయి. దీంతో ఆ దేశాల్లో కరోనాను కట్టడి చేయడం సాధ్యమైంది. ఇలా కరోనా టీకాను సమర్ధవంతంగా ప్రజలకు అందచేయడం ద్వారా కరోనాను కట్టడిలోకి తీసుకు వచ్చిన ఆరు దేశాల గురించి తెలుసుకుందాం.

బ్రిటన్ (యూకే)

టీకాలతో సానుకూల ఫలితాలు సాధ్యం అని చెప్పడానికి యూకే ఓ పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. గత సంవత్సరం డిసెంబర్ 8 నుండి ఇక్కడ టీకా డ్రైవ్ ప్రారంభమైంది. ఆ సమయంలో అక్కడ దేశవ్యాప్తంగా కరోనా కేసులు 60 నుంచి 70 వేల వరకూ నమోదు అవుతుండేవి. ప్రతి రోజు దాదాపు 1000 నుంచి 2000 మరణాలు సంభావించేవి. టీకా కార్ల్యక్రమం ప్రారంభించాకా ఈ సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజూ ఒకటి నుండి రెండు వేల మంది మాత్రమే వ్యాధి బారిన పడుతుండగా, 15 నుండి 20 మంది మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఆంక్షలు ఎత్తివేశారు. మునుపటిలాగా పాఠశాలలు, కళాశాలలు తెరచుకున్నాయి.

ఇజ్రాయెల్‌-జనాభాలో 61% మందికి వ్యాక్సిన్..

ఇజ్రాయెల్‌లో వ్యాక్సినేషన్ చాలా వేగంగా జరిగింది. ఇప్పుడు అక్కడ మాస్క్ లు ధరించడం మానేశారు. ప్రజలు ముసుగు లేకుండా తిరుగుతున్నారు. పాఠశాల-కళాశాల, వ్యాపారం తిరిగి ప్రారంభించారు. మార్కెట్లు తెరుచుకుంటున్నాయి, పర్యాటకులు వస్తున్నారు. అంటే ఇజ్రాయెల్ కరోనాను దాదాపు ఓడించింది. ఇవన్నీ సాధ్యమయ్యాయి, ఎందుకంటే ఇప్పటివరకు 61% జనాభా ఇక్కడ టీకాలు వేశారు. రాబోయే రెండు, మూడు నెలల్లో 90% దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. అంతకుముందు ఇక్కడ రోజూ 10 నుంచి 11 వేల మందికి కరోనా సోకినట్లు చెప్పేవారు. అలాగే, ప్రతిరోజూ ఒకటి లేదా రెండు మరణాలు సంభవించేవి. కానీ, ఇప్పుడు 100 మందికి వ్యాధి సోకుతోంది. మరణాలు పూర్తిగా లేవు.

అమెరికాలో ఇక్కడ లానే..

యూఎస్ లోనూ పరిస్థితి ఇక్కదిలానే ఉండేది. అక్కడ కూడా కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జనరల్ ఎలక్షన్లు జరిగాయి. నాయకుల ర్యాలీలు, జన సమూహాల సమావేశాలు నిర్వహించారు. అప్పుడు ఇక్కడ రొజూ మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చేవి అమెరికాలో. అందులో 2 నుంచి 6 వేయల మంది చనిపోయేవారు. కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగించడంతో ఇక్కడ కరోన అదుపులోకి వచ్చింది. ఇక్కడ జనాభాలో 39.56% మందికి టీకాలు వేయించారు. దీనివల్ల సంక్రమణ రేటు 80% పడిపోయింది. ఇప్పుడు అక్కడ 50-60 వేల మందికి మాత్రమె కరోనా సోకుతోంది. పరిస్థితి మెరుగుపడుతోంది..

జనవరి నాటికి, స్పెయిన్‌లో 25-30 వేల కేసులు నమోదవుతున్నాయి, ఇప్పుడు ఇక్కడ 8-10 వేల మంది వ్యాధి బారిన పడుతున్నారు. 20% టీకా మాత్రమే ఇక్కడ జరిగింది. అదేవిధంగా, ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు 18.73% మందికి టీకాలు వేశారు. ఇక్కడ, ఏప్రిల్ ప్రారంభంలో, ఒక రోజులో 60 వేల మంది రోగులు నమోదు అయ్యేవారు. ఇప్పుడు అది తగ్గుతోంది. ఇప్పుడు ప్రతి రోజు 25-30 వేల కేసులు వస్తున్నాయి. జర్మనీలో, ప్రస్తుతం జనాభాలో 20.07% టీకాలు వేస్తున్నారు. దీని ప్రభావం ఏమిటంటే ఇక్కడ మరణాల వేగం గణనీయంగా తగ్గింది. జనవరి వరకు ఒకటి నుండి ఒకటిన్నర వేల మంది రోగులు చనిపోతుండేవారు. ఇప్పుడు ప్రతి రోజు 200-400 మంది మరణిస్తున్నారు.

భారతదేశంలోటీకా సానుకూల ప్రభావం

మన దేశంలో ఈ సమయంలో రెండు రకాల వ్యాక్సిన్ వాడుతున్నారు. మొదటి కోవిషీల్డ్ , రెండవది కోవాక్సిన్. ఈ రెండు వ్యాక్సిన్ల ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు, కోవిషీల్డ్ ద్వారా 116 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ నుంచి రక్షణ పొందారు. కేంద్ర లెక్కల ప్రకారం, మొదటి మోతాదు తర్వాత 17,145 మందికి వ్యాధి సోకినట్లు గుర్తించగా, రెండవ మోతాదు తర్వాత ఈ సంఖ్య 5014 కి తగ్గింది. అదేవిధంగా, మొదటి మోతాదు కోవాక్సిన్ తీసుకున్న తర్వాత 4208 మంది సానుకూలంగా ఉన్నట్లు గుర్తించగా, రెండవ మోతాదు తీసుకున్న తర్వాత 695 మందికి మాత్రమే వ్యాధి సోకింది.

Also Read: Health Tips for immunity Boost: అసలే కరోనా సెకండ్ వేవ్.. రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి.. ఎందుకంటే..

Viral News: సూపర్ హీరోలకే హీరో… మరోసారి పెద్దమనసు చాటుకున్న మయూర్‌ షెల్కే.. రివార్డు డ‌బ్బును

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!