AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetarian Food: స్త్రీలు గర్భధారణ సమయంలో శాఖాహారం మాత్రమే తినాలా? నిపుణుల అభిప్రాయం ఏమిటి..?

Vegetarian Food: గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ స్థాయిలో శాకాహారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. శాకాహార ఆహారంతో గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2..

Vegetarian Food: స్త్రీలు గర్భధారణ సమయంలో శాఖాహారం మాత్రమే తినాలా? నిపుణుల అభిప్రాయం ఏమిటి..?
Pregnancy
Subhash Goud
|

Updated on: Sep 24, 2022 | 8:06 PM

Share

Vegetarian Food: గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ స్థాయిలో శాకాహారుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. శాకాహార ఆహారంతో గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 మధుమేహం మొదలైనవాటిని తగ్గించవచ్చని ఇప్పటివరకు చేసిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో శాఖాహారం తినడం బిడ్డ ఆరోగ్యానికి మంచిదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఢిల్లీకి చెందిన పోషకాహార నిపుణుడు డాక్టర్ నిశాంత్ తన్వర్ TV9తో మాట్లాడుతూ.. శాఖాహారం తీసుకునే గర్భిణీ స్త్రీకి విటమిన్ B12, కాల్షియం, అయోడిన్, ఐరన్, ప్రొటీన్ మొదలైన వాటి తీవ్రమైన లోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా పుట్టిన సమయంలో శిశువు బరువు కూడా తక్కువగా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి ఐరన్‌ అత్యంత ముఖ్యమైన పోషకం. దీని లోపం రక్తహీనతకు దారి తీస్తుందని డాక్టర్ తన్వర్ వివరించారు. అదేవిధంగా పిల్లల మెదడు అభివృద్ధికి విటమిన్ B12 చాలా ముఖ్యమైనది.

క్యాలరీలను తగ్గించడంలో శాఖాహారం మేలు చేస్తుందా?

క్యాలరీలు తీసుకోవడం తగ్గించి గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవాలనుకునే వారికి శాకాహార ఆహారం మంచి ఎంపిక అని నిపుణులు తెలిపారు. గర్భధారణ సమయంలో శిశువు మెరుగైన, ఆరోగ్యకరమైన పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. గుడ్లు, చికెన్, చేపలు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు వంటి జంతు ప్రోటీన్లు ప్రోటీన్ మంచి వనరులని, ఒక స్త్రీ శాఖాహారం అయితే, ఆమెకు ఈ ప్రోటీన్ల కోసం సప్లిమెంట్ అవసరం అని అన్నారు. ఇలాంటి ఆహారాన్ని తినడం ఎల్లప్పుడూ మంచిది.. తద్వారా శరీరానికి సహజంగా విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. వాటికి మందులు వేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

గర్భధారణ సమయంలో శాఖాహారం తినడం మంచిదేనా?

ఢిల్లీలోని పితంపురలోని మదర్స్ ల్యాప్ ఐవీఎఫ్ సెంటర్‌లోని గైనకాలజిస్ట్, ఇన్‌ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్ డాక్టర్ శోభా గుప్తా మాట్లాడుతూ.. చాలా మంది భారతీయులు శాఖాహారం అంటే పాల ఉత్పత్తులను తీసుకుంటారని అన్నారు.  పౌల్ట్రీ ఆధారిత ఉత్పత్తులు జీర్ణం కావడానికి సమయం పడుతుందని సాధారణ అభిప్రాయం. ఈ కారణంగా గర్భిణీ స్త్రీలు మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారని అన్నారు. అయితే  ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్భిణీ స్త్రీలు వారి డాక్టర్, పోషకాహార నిపుణుడితో వివరంగా చర్చించి, పిల్లల సరైన అభివృద్ధి కోసం వారు సూచించిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అయితే డాక్టర్ శోభా గుప్తా కూడా డాక్టర్ తన్వర్ అభిప్రాయాలను అంగీకరించారు. ఎముకల ఆరోగ్యానికి పాల ఉత్పత్తులు ఎంతో అవసరమన్నారు. ఈ విషయాలలో జీవ లభ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి సోయా మిల్క్ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. గర్భిణులు పచ్చిమిర్చి, ఓట్ మీల్, మిల్లెట్, బాదం, పప్పులు తినవచ్చని సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి