AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies for Cough: గొంతులో కఫం పేరుకుపోయి ఇబ్బంది పెడుతోందా? వేడి నీళ్లలో ఇది మరిగించి తాగారంటే

సీజన్‌ మారినప్పుడల్లా జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. గొంతులో కఫం పేరుకుపోయి, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. జలుబు తేలికగా తగ్గకపోతే కొంతమంది యాంటీబయాటిక్స్ సహాయం తీసుకుంటుంటారు. అయితే యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. ఈ పరిస్థితిలో..

Home Remedies for Cough: గొంతులో కఫం పేరుకుపోయి ఇబ్బంది పెడుతోందా? వేడి నీళ్లలో ఇది మరిగించి తాగారంటే
Home Remedies For Cough
Srilakshmi C
|

Updated on: Jan 08, 2024 | 8:42 PM

Share

సీజన్‌ మారినప్పుడల్లా జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. గొంతులో కఫం పేరుకుపోయి, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది తలెత్తుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. జలుబు తేలికగా తగ్గకపోతే కొంతమంది యాంటీబయాటిక్స్ సహాయం తీసుకుంటుంటారు. అయితే యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది. ఈ పరిస్థితిలో ఇంటి నుంచి ఉపాయాలు ఉపయోగపడతాయి. దగ్గు, గొంతునొప్పి, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు తీవ్రంగా వేదిస్తాయి. ఈ సమస్యలకు చికిత్స చేయడానికి ఇంటి నివారణల సహాయం తీసుకోవచ్చు. ఇది శ్లేష్మం ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. జలుబు, దగ్గు నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

ములేటి వేరు టీ

రోజుకు రెండుసార్లు ములేటి టీ తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. 1/2 అంగుళాల ముల్లేతి రూట్, తురిమిన అల్లం వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనితో రుచి కోసం కొంచెం తేనెను కలుపుకుని తాగితే హాయిగా ఉంటుంది.

తేనె – నిమ్మకాయ టీ

జలుబు, దగ్గుకు రోజుకు 3 సార్లు తేనె, నిమ్మకాయ టీ తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. వేడి నీటిలో 2 చెంచాల తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. తేనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పసుపు-పాలు

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి, తేనె కలిపి తాగాలి.

అల్లం టీ

జలుబు, దగ్గుకు అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు వచ్చినప్పుడు అల్లం ముక్కను నోటిలో పెట్టుకున్న ఫలితం ఉంటుంది. ఇది గొంతు నొప్పి నుంచి చక్కని ఉపశమనం కలిగిస్తుంది. వేడినీరు లేదా టీతో అల్లం మరిగించి, దానిలో తులసి ఆకులు, మిరియాల పొడి వేసుకోవాలి. ఈ టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఈ టీలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.