Fruit Juice ఎండాకాలంలో అధిక శక్తినిచ్చే పళ్ల రసాలు.. ఏయే విటమిన్స్ ఉంటాయి.. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే..!
Fruit Juice: సమ్మర్లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ కాలంలో ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు...
Fruit Juice: సమ్మర్లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ కాలంలో ఎండల వేడి నుంచి తట్టుకునేందుకు వివిధ పళ్ల రసాలు ఎంతో మేలు చేస్తాయి. సమ్మర్లోశరీరంలోని లవణాలన్నీ చెమల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దీంతో మనిషికి నీరసం వస్తుంటుంది. ఎండాకాలంలో అధికంగా నీళ్లు తాగడం, పళ్ల రసాలు తాగడం వల్ల ఎంతో మేలని వైద్యులు చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. వీటి వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అలసిపోకుండా ఉంటాము. ఇంకా వడదెబ్బ నుంచి రక్షణ పొందుతాము.
ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకుండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
పండ్ల రసాల వల్ల ఉపయోగాలు
►ఈ పండ్ల రసాలతో విటమిన్-ఎ,సిలు పుష్కలంగా ఉంటాయి. ► మలబద్దంగా సమస్య తొలగిపోతుంది. ►ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు ►కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి ► చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి. ► పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి. ► ఎసిడిటి, అల్సర్ సమస్యను నివారిస్తాయి ► నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య దూరం అవుతంది. ► శరీరంలో నీటి శాతం పెరుగుతుంది ► బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ► పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి ► గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ► డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంటుంది. ► శరీరంలో ఉన్న వ్యర్థలను తొలగిపోతాయి
ఇలా పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. దాహం ఎక్కువగా ఉండటం, అందులో అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుందని, అందుకే ఇతర పదార్థాలు, కూల్డ్రింక్స్లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ పండ్ల రసాలతో ఇలాంటి ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. ఈ జ్యూస్ల కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు. వాటర్మిలన్ జ్యూస్ కాకుండా తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు. ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: మీ పిల్లలు చెక్కర తింటున్నారా ? వారి మెదడుపై ఈ ప్రభావం ఉంటుందట.. అధ్యాయనాల్లో షాకింగ్ విషయాలు..
షూగర్ వ్యాధి ఉన్నవారు బెండకాయ తింటే మంచిదేనా ? తాజా అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..