AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Stones: కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తుందా..? ఈ మూడు రసాలతో చెక్ పెట్టవచ్చు..

Kidney Stones Diet: ప్రస్తుత కాలంలో రోజురోజుకూ కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. మనం తీసుకునే ఆహారం, పలు కారణాల వల్ల మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Kidney Stones: కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తుందా..? ఈ మూడు రసాలతో చెక్ పెట్టవచ్చు..
Kidney Stones
Shaik Madar Saheb
|

Updated on: Apr 04, 2022 | 11:56 AM

Share

Kidney Stones Diet: ప్రస్తుత కాలంలో రోజురోజుకూ కిడ్నీ సమస్యలు పెరిగిపోతున్నాయి. మనం తీసుకునే ఆహారం, పలు కారణాల వల్ల మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమస్యల్లో కిడ్నీల్లో రాళ్ల సమస్య ఒకటి. ఒక వ్యక్తి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు.. బాధితుడు చాలా బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్న వారు మంచి డైట్ ప్లాన్‌ను అనుసరించడం మంచిదని.. దీంతో సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే.. కొన్ని రసాల సహాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాంటి రసాలు (జ్యూస్‌లు) కిడ్నీల్లో రాళ్ల సమస్యను దూరం చేస్తాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలి..? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మూత్రపిండాల్లో రాళ్లను దూరం చేసే రసాలు/జ్యూస్‌లు

మీరు కిడ్నీల్లో రాళ్లతో ఇబ్బంది పడుతుంటే.. ఈ 3 రకాల రసాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో నొప్పితో సహా అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

టమాటా రసం..

కిడ్నీల్లో రాళ్లను తొలగించడంలో టమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. రెండు టమోటాలు శుభ్రంగా కడిగి వాటిని మెత్తగా చేయాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, ఎండుమిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఎక్కువగా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత జ్యూస్ రూపంలో తాగవచ్చు.

నిమ్మరసం..

నిమ్మకాయలో ఎక్కువ మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కిడ్నీ స్టోన్‌ సమస్యతో బాధపడుతున్న వారు నిమ్మరసం తీసుకుంటే.. ఈ సమస్యను అధిగమించవచ్చు. పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక చెంచా నిమ్మరసం వేసి.. రుచికి తగినట్లుగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

తులసి రసం..

కిడ్నీల్లో రాళ్ల సమస్యను దూరం చేయడంలో తులసితో చేసిన రసం బాగా ఉపయోగపడుతుంది. కొన్ని తులసి ఆకుల రసాన్ని తీసి, దానికి ఒక చెంచా తేనె కలిపి తాగాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

(ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే.. ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.)

Also Read:

Ginger for Hair: డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా..? అల్లంతో చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే..?

Ramadan 2022: సెహ్రీ, ఇఫ్తార్‌ విందులో ఖర్జూరాలు తప్పనిసరిగా తింటారు? ఎందుకో తెలుసా..