AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: అన్నం మానేసి రొట్టెలు తిన్నా షుగర్ తగ్గడం లేదా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే!

మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మన భారతీయ భోజనంలో బియ్యం లేదా గోధుమ రొట్టె లేనిదే ముద్ద దిగదు. అయితే, గోధుమ రొట్టె తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది భయపడుతుంటారు. ఈ విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. గోధుమలు నిజంగానే హానికరమా లేక మనం తినే పద్ధతిలో లోపం ఉందా? అన్న సత్యాన్ని డైటీషియన్ గీతికా చోప్రా తాజా నివేదికలో వెల్లడించారు.

Diabetes Diet: అన్నం మానేసి రొట్టెలు తిన్నా షుగర్ తగ్గడం లేదా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే!
Wheat Roti And Diabetes
Bhavani
|

Updated on: Feb 06, 2026 | 8:20 PM

Share

గోధుమలు కార్బోహైడ్రేట్లకు ప్రధాన వనరు. శాస్త్రీయంగా చూస్తే కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌గా మారుతాయి. కానీ, గోధుమలను మనం ఏ రూపంలో తీసుకుంటున్నామనేదే ఇక్కడ ముఖ్యం. మైదా, బ్రెడ్ లేదా బిస్కెట్ల రూపంలో తీసుకుంటే చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అదే సమయంలో తృణధాన్యాల పిండితో చేసిన రొట్టెలు తింటే అందులోని ఫైబర్ చక్కెర శోషణను నియంత్రిస్తుంది. మధుమేహ రోగులు గోధుమల కంటే ఇతర తృణధాన్యాలను కూడా చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

గోధుమ రొట్టె ఎవరికి ఎక్కువ ప్రయోజనం :

శుద్ధి చేసిన గోధుమలు వద్దు: బ్రెడ్, పాస్తా, మైదా వంటివి చక్కెరను వేగంగా పెంచుతాయి. వీటికి మధుమేహ రోగులు దూరంగా ఉండాలి.

తృణధాన్యాల పిండి: ఫైబర్ అధికంగా ఉండే హోల్ వీట్ పిండిని వాడటం వల్ల జీర్ణక్రియ నిదానంగా జరిగి, చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి.

పరిమాణం ముఖ్యం: గోధుమలు మంచివే అయినా, ఒకేసారి 3 నుండి 4 రొట్టెలు తినడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

డయాబెటిక్ రోగుల కోసం స్మార్ట్ డైట్ టిప్స్:

ధాన్యాల మార్పు: వారానికి 3 సార్లు మాత్రమే గోధుమ రొట్టె తిని, మిగిలిన రోజుల్లో జొన్నలు, సజ్జలు, రాగి లేదా బార్లీ వంటి ధాన్యాలతో చేసిన రొట్టెలను అలవాటు చేసుకోవాలి.

మిక్స్డ్ పిండి (Multi-grain): గోధుమ పిండిలో సోయా లేదా శనగపిండి కలపడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గి, పోషకాలు పెరుగుతాయి.

సలాడ్ల ప్రాముఖ్యత: భోజనానికి ముందు దోసకాయ, టమోటా వంటి ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు తింటే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పండ్లు తినే పద్ధతి: పండ్లను రసంగా కాకుండా ముక్కలుగానే తినాలి. జ్యూస్ తాగడం వల్ల శరీరానికి నేరుగా చక్కెర అందుతుంది, ఇది హానికరం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మధుమేహం తీవ్రతను బట్టి మీ వ్యక్తిగత డైట్ ప్లాన్ కోసం నిపుణులైన వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.