AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: పుచ్చకాయ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ పెరుగుతుందా?

Diabetes: పుచ్చపండు.. దీనిని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. సమ్మర్‌ సీజన్‌లో ప్రతి ఒక్కరికి ఎంతో మంచిది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు ఈ పండును తినవచ్చా? ఒక వేళ తింటే రక్తంలో షుగర్ లెవల్స్‌ పెరుగుతాయా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు..?

Diabetes: పుచ్చకాయ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ పెరుగుతుందా?
Subhash Goud
|

Updated on: May 28, 2025 | 10:47 PM

Share

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినకూడదని అందరికీ తెలుసు. ఎందుకంటే అవి చక్కెర స్థాయిలను పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో మధుమేహంలో అనేక పండ్లు తినొద్దని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే వాటిలో చక్కెర స్థాయిలను పెంచే సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ప్రసిద్ధి చెందిన పుచ్చకాయను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాలా వద్దా అనే దానిపై చాలా గందరగోళం చాలా మందిలో ఉంటుంది.

ఇక్కడ మీరు డయాబెటిస్‌లో పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలు, హాని గురించి తెలుసుకోవచ్చు. అలాగే దానిని సరిగ్గా ఎలా తినాలో కూడా తెలుసుకోండి.  సమతుల్య ఆహారంలో భాగంగా పుచ్చకాయ తీసుకుంటే చక్కెర స్థాయిలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదంటున్నారు నిపుణులు. డయాబెటిస్ ఉన్న రోగులలో గుండె జబ్బులు చాలా సాధారణం. నియంత్రిత పరిమాణంలో పుచ్చకాయ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పుచ్చకాయకు ఎరుపు రంగును ఇచ్చే లైకోపీన్ అనే భాగం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, లైకోపీన్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి