Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా.. ఆ వ్యాధితో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేకుంటే

దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి సేవలో భక్తజనం తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక సంబురం ఈ సమయం. భక్తులు వివిధ రకాల పూజలు చేయడం ద్వారా దేవీ కృప పొందుతుంటారు...

Health: నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా.. ఆ వ్యాధితో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేకుంటే
Diabetic
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 27, 2022 | 9:51 PM

దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి సేవలో భక్తజనం తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక సంబురం ఈ సమయం. భక్తులు వివిధ రకాల పూజలు చేయడం ద్వారా దేవీ కృప పొందుతుంటారు. అయితే నవరాత్రి పూజల్లో చాలా మంది ఉపవాసం ఉంటుంటారు. ఇది జీవితంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశం. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో ఇది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ మధుమేహ నిర్వహణ కోసం ఉపవాసాన్ని ఒక సాంకేతికతగా సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే వైద్య పోషకాహార చికిత్స,శారీరక శ్రమతో సహా జీవనశైలిలో మార్పులు, బరువు తగ్గడానికి చాలా ముఖ్యమైన విషయాలు. డయాబెటిక్ – టైప్ I, టైప్ II డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ కాలం ఉపవాసం ఉండడం గానీ భోజనం గానీ మానేయకూడదని ఢిల్లీలోని జస్ట్ డైట్ క్లినిక్‌లోని డైటీషియన్ జస్లీన్ కౌర్ అన్నారు. మధుమేహం ఉన్నవారు అల్పాహారం చేసేందుకు సరైన మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో సాధారణంగా రోటీని తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. రోటీలోని పీచుపదార్థం, డయాబెటిక్ బాధితులకు చక్కగా పనిచేస్తుంది.

రాత్రి భోజనానికి ఒక గ్లాసు పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపవాస సమయంలో చాలా మంది ప్రజలు మూడు పూటలు తినకుండా ఉంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజుకు మూడు పూటలా పరిమిత మోతాదులో ఆహారం తీసుకోవాలి. వారి షుగర్ లెవెల్స్ ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అధిక స్థాయి, అలాగే తక్కువ స్థాయి చక్కెర చాలా ప్రమాదకరమైనది. ఇది హైపోగ్లైసీమిక్‌గా మారవచ్చు అంతే కాకుండా వ్యక్తి కోమాలోకి వెళ్ళవచ్చు. అలాంటి వారికి కొబ్బరి నీరు, రోజుకు రెండు పండ్లు, ఒక గ్లాసు మజ్జిగ, పనీర్ ను డైట్ లో భాగం చేయాలి.

కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్ధాలకు బదులుగా అధిక ప్రోటీన్ ఆహారం, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉపవాస సమయంలో చిప్స్, వేరుశనగ వంటి ప్రాసెస్ చేసిన స్నాక్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆహారాలు తినడానికి ధోరణి ఉంది. ఎనిమిది గంటల విరామం తర్వాత తినే భోజనం మితంగా ఉండాలి. రాత్రి భోజనం రోజులో తేలికైన భోజనం అయి ఉండాలి. చిరుతిండికి మధ్య కూడా దూరంగా ఉండాలని నిపుణులు వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..