AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: పొరపాటున కూడా ముఖం మీద ఇవి రాయొద్దు.. రాసారో అందవికారంగా మారడం ఖాయం..!

Beauty Tips: ముఖారవిందం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. దాంతో ముఖం మెరవడం

Beauty Tips: పొరపాటున కూడా ముఖం మీద ఇవి రాయొద్దు.. రాసారో అందవికారంగా మారడం ఖాయం..!
Shiva Prajapati
|

Updated on: Feb 25, 2021 | 11:12 PM

Share

Beauty Tips: ముఖారవిందం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. దాంతో ముఖం మెరవడం పక్కన బెడితే ఊహించని రీతిలో దెబ్బ తింటుంది. ముఖ్యంగా కొన్ని పదార్థాలు మొహానికి నేరుగా రాయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ముఖం రంగు నల్లగా మారిపోతుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మకాయ: కొంతమంది నిమ్మ తొక్కతో ముఖానికి నేరుగా మసాజ్ చేస్తారు. లేదా ముఖానికి నిమ్మరసం రాస్తారు. వాస్తవానికి నిమ్మకాయను ఎప్పుడూ ముఖాం మీద నేరుగా ఉపయోగించబడదు. ఇది ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తుంది. అలాగే చర్మం రంగు ముదురుగా కనిపించేలా చేస్తుంది. అందుకే నిమ్మకాయను, నిమ్మ రసాన్ని నేరుగా ఫేస్‌కు అప్లై చేయొద్దు.

వేడి నీరు: కొంతమందికి వేడి నీటితో ముఖం కడుక్కోవడం అలవాటు. గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ తొలగి ముఖం పొడిబారిపోతుంది. అందుకే వేడి నీటితో కడుక్కోవడానికి బదులుగా ఆవిరి పట్టడం చాలా మంది.

టూత్‌పేస్ట్: ముఖం మీద మొటిమలు కొంతమంది ప్రజలు తరచుగా టూత్‌పేస్ట్‌ను అప్లై చేస్తారు. అయితే, టూత్ పేస్ట్ అంత క్షేమం కాదు. మొటిమ ఏర్పడ్డ ప్రాంతంలో టూత్‌పేస్ట్ రాయడం వల్ల నల్ల మచ్చ ఏర్పడే ప్రమాదం ఉంది.

మైనం: కొంతమంది ముఖానికి మైనం పిండిని కూడా అప్లై చేస్తారు. దానిని పూర్తిగా వీడాలి. ముఖ చర్మం చాలా మృదువైనది. మైనం రాయడం వల్ల ముఖ చర్మానికి హానీ కలుగుతుంది.

ముఖారవిందం కోసం ఇవి ట్రై చేయండి.. 1. పచ్చి పాలతో ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రపరచడం వల్ల ముఖం రంగు క్రమంగా మారుతుంది. అందంగా మారడంతో పాటు.. చర్మం మెరిసేలా చేస్తుంది. 2. చిరు ధాన్యాలు కూడా చర్మానికి చాలా మేలు చేస్తాయి. చిరు ధాన్యాలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం రుబ్బుకుని పాలతో కలిపి ముఖానికి రాయాలి. కొద్ది రోజుల్లో ముఖం రంగులో మార్పు వస్తుంది. 3. ఆరెంజ్ పీల్స్ ఆరబెట్టి వాటిని పొడిగా చేసుకోండి. ఈ పొడిలో పాలు, తేనె కలపండి. ముఖం మీద రాయండి. ఇది బాగా పని చేస్తుంది. 4. క్రీమ్, గ్రామ్ పిండి కూడా ముఖాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని అప్లై చేయడం ద్వారా చర్మంలో మెరుపు పెరుగుతుంది. 5. ధాన్యాలు రాత్రి నానబెట్టి, ఉదయం రుబ్బుకోవాలి. వాటిని పాలతో కలిపి ప్యాక్ లాగా ముఖం మీద రాయాలి. ఇది ముఖం చర్మం మెరిసేలా చేస్తుంది. కొద్ది రోజుల్లోనే రంగు కూడా మారుతుంది.

Also read:

జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుందా?.. ఇలా చేసి అద్భుతమైన జట్టును పొందండి..!

డ్యాన్స్ షో కోసం ఏకంగా అనకొండను పెంచుకున్నాడు.. ఇక్కడే పాలకొల్లు కుర్రాడి ప్లాన్ బెడిసి కొట్టింది..